Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రత్యేక హోదా పై స్పందించిన మెగా హీరోలు..... నేను సిద్దం అంటూ వరుణ్ తేజ్
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ టాలీవుడ్ హీరో, జనసేనాని పవన్ కళ్యాణ్తో పాటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ కూడా తమ మద్దతును తెలిపారు.
తమిళనాడు ప్రజల మెరీనా బీచ్ జల్లికట్టు ఉధ్యమం ఏపీ ప్రజలతో హోదా కాంక్ష రేకెత్తించింది. ప్రత్యేకహోదాకోసం నెమ్మదిగా ఒక్కొక్కరు కదులుతున్నారు. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ ఎంపీ కేవీపీలు జల్లికట్టు ఉద్యమ స్పూర్తితో ప్రత్యేకహోదా ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించగా. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా హోదాకోసం ఎవరు వచ్చినా పోరాడేందుకు సముఖత వ్యక్తం చేస్తోంది.
చెన్నై మెరీనా బీచ్ లో యువ'తరంగం' ఉవ్వెత్తున ఎగసిపడడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఆగమేఘాల మీద జల్లికట్టు ఆర్డినెన్స్ కు కేంద్ర సర్కారు పచ్చజెండా ఊపింది. తమ సంప్రదాయ క్రీడపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని సముద్రతీరంలో తమిళ యువత సాగించిన పోరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించింది.
జల్లికట్టుపై కట్టుబాట్లను తెంచేందుకు పాలకులు అంగీకరించినా విద్యార్థులు వెనక్కు తగ్గలేదు. ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసే దాకా ఉద్యమం ఆపేదిలేదంటూ మెరీనా బీచ్ వదిలేందుకు యువత విముఖత వ్యక్తం చేసింది. 'మన రాష్ట్రం- మన హోదా' అంటూ మహోద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
ప్రత్యేకహోదా కోసం ఈ నెల 26న విశాఖ బీచ్లో ఉద్యమానికి ఆంధ్ర యువత సిద్ధమవగా, ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ టాలీవుడ్ హీరో, జనసేనాని పవన్ కళ్యాణ్తో పాటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ కూడా తమ మద్దతును తెలిపారు. హీరో సాయి ధ్రం తేజ్ తన ఫేస్బుక్ వాల్ మీద "నా రాష్ట్రానికీ, ప్రజలకీ మంచి జరిగేది ఏదైనా దానికి మద్దతివ్వాల్సిందే... నేను ఏపీ ప్రత్యేక హోదా (పోరాటానికి) మద్దతు ఇస్తున్నా" అంటూ పోస్ట్ చేసాడు.
ఇంతే కాదు ఏపీ ప్రత్యేక హోదాకోసం యువహీరోలంతా కదులుతున్నారు. మెగా ఫ్యామిలీ లో నుంచి పవన్, చిరు, వరుణ్ తేజ్ లు స్పందించినా ఇప్పటివరకూ నందమూరి హీరోలనుంచి మాత్రం ఈ 26 నిరసన కార్యక్రమం గురించి ఏ ప్రకటనా రాకపోవటం పై కొన్ని ఫేస్బుక్ కామెంట్లు మాత్రం వినిపిస్తున్నాయి.
ఇదిమనమంతా ఏకమవ్వాల్సిన సమయం అంటూ... ఒకప్పటి బాలనటుడూ..ఇప్పటి హీరో రేపటి కృష్ణవంశీ నక్షత్రం లో కనిపించబోయే స్టైలిష్ విలన్ తనీష్ పోస్ట్ చేస్తే. మరో యువహీరో సందీప్ కిషన్ ఈ 26 న జరగబోయే శాంతి నిరసన కి రండి అంటూ పోస్ట్ చేసాడు. కలిసి కట్టు గాపోరాడే ప్రజలతో సినీ హీరోలు కలిస్తే హైప్ వస్తుందన్న విషయమూ ఇప్పుడిప్పుడే మనోళ్ళకూ ఎక్కుతోంది. వరదలూ, భూకంపాలకూ మాత్రమే కలిసి వచ్చే మన తారలు ఇప్పుడు మిగతా విషయాల మీద కూడా కాస్త దృష్టి పెడుతున్నారు...