Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చిరంజీవి కాలికి గాయం, వివి వినాయక్ వెళ్లింది అందుకే...!
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల దర్శకుడు వివి వినాయక్ కలవడంతో సరికొత్త వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తన 150వ సినిమాకు పూరిని తప్పించి వినాయక్ తో చేయాలని చిరంజీవి ప్లాన్ చేసుకుంటున్నట్లు వార్తలు హల్ చల్ చేసాయి. అయితే వినాయక్ చిరంజీవిని కలవడం వెనక అసలు కారణం ఏమిటో బయటకు వచ్చింది.
మెగా సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి కాలికి మైనర్ ఫ్యాక్చర్ అయిందని, ఇంట్లో మెట్లపై నుండి జారి పడ్డారని సమాచారం. ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ బయటకు పొక్కనీయలేదు. అయితే చిరంజీవికి సన్నిహితంగా వినాయక్ కు ఈ విషయం తెలియడంతో వెంటనే వెళ్లి పరామర్శించినట్లు సమాచారం.
చిరంజీవి, వినాయక్ మధ్య అసలు 150వ సినిమా ప్రస్తావనే రాలేదని ఆయనకు అత్యంత సన్నిహితులు చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా చిరంజీవి 150వ సినిమా చేసేది పూరి జగన్నాథే అని అంటున్నారు. ఇప్పటికే పూరి ఫస్టాఫ్ స్క్రిప్టు వినిపించారని, సెకండ్ హాఫ్ స్టోరీ త్వరలో వెల్లడిస్తారని సమాచారం.
మరో వైపు చార్మి కూడా ఇటీవల ‘జ్యోతి లక్ష్మి' అభినందన సభలో ఈ విషయం మరోసారి ఖరారు చేసారు. ఈ వేడుకకు పూరి రాక పోవడంపై ఛార్మి స్పందిస్తూ.... ఆయన చిరంజీవి 150వ సినిమా విషయంలో బిజీగా ఉన్నారని, అందుకే రాలేక పోయారని స్పష్టం చేసారు.