Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘మేము సైతం’లో థంబోలా: బెంజి కారు గెలుచుకోవచ్చు!
హైదరాబాద్: విశాఖను అతలాకుతలం చేసిన హుధూద్ తుఫాన్ కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందకు, భారీగా నిధులు సేకరించేందుకు ఈ నెల 30న ‘మేము సైతం' పేరుతో తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం కలిసి భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా పెర్ఫార్మెన్స్ ఇవ్వ బోతున్నారు.
మేము సైతం...ప్రొగ్రామ్ చూసేందుకు ఒక్కో టికెట్ ఖరీదు రూ. 15000. బుక్ మై షో ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. ఈ టికెట్స్ కొన్నవారంతా థంబోలా గేమ్లో పాల్గొనే అవకాశం దక్కించుకుంటారు. థంబోలా గేమ్ విజేతకు మెర్జిడెజ్ బెంజ్ కారు గిఫ్టుగా ఇచ్చేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.
రోజంతా
వినోద
కార్యక్రమాలు....
త్రివిక్రమ్
సమక్షంలో
పవన్
కళ్యాణ్,
మహేష్
బాబు
కలిసి
ఓ
స్కిట్
చేయబోతున్నారనే
విషయం
తెలిసిందే.
ఇందులో
త్రివిక్రమ్
వారిద్దరికి
ప్రశ్నలు
వేస్తే...వారు
ఆసక్తికరంగా
సమాధానాలు
ఇవ్వనున్నారు.
పూర్తి
వినోదాత్మకంగా
ఈ
కార్యక్రమం
జరుగనుంది.
అదే
విధంగా
దర్శకుడు
బోయపాటి
శ్రీను
సమక్షంలో
నందమూరి
హీరోలు
బాలకృష్ణ,
జూ
ఎన్టీఆర్
కలిసి
కూడా
ఓ
షో
చేయబోతున్నారని
తెలుస్తోంది.
దీంతో
12
గంటల
పాటు
జరిగే
ఈ
కార్యక్రమంలో
వివిధ
స్టార్స్
అంత్యాక్షరి,
డాన్స్
ఫ్రోగ్రామ్స్
ఇలా
చాలా
కార్యక్రమాలు
ఉండబోతున్నాయని
తెలుస్తోంది.
తెలుగు పరిశ్రమ లోని యంగ్ హీరోస్ అంతా 4 టీమ్స్ గా విడిపోయి ఈ మ్యాచ్ ఆడనున్నారు. ప్రతి టీంలోనూ 6 మంది ప్లేయర్స్ ఉంటారు, అందులో 4 హీరోస్ ఉంటే ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. అలాగే ప్రతి మ్యాచ్ కి 6 ఓవర్లు మాత్రమే ఉంటాయి. ఈ క్రికెట్ మ్యాచ్ మొత్తానికి హెడ్ గా వెంకటేష్ వ్యవహరించనున్నాడు. టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మోహన్ బాబు మొదలైన వారు లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. తెలుగు పరిశ్రమ ప్రముఖులతో తమిళ పరిశ్రమ నుండి రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తి, విక్రమ్ తదితరులు హాజరవుతున్నారు. నవంబర్ 30న టాలీవుడ్ కి సెలవు ప్రకటించారు. పవన్, మహేష్, బాలకృష్ణ, జూ ఎన్టీఆర్, వెంకటేష్ లాంటి స్టార్స్ ఉండటంతో ఈ పోగ్రాం ట్రాన్సిమిషన్ రైట్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఫైనల్ గా జెమినీ టీవి వారు ఈ ప్రసార హక్కులను సొంతం చేసుకున్నారు.