Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మోహన్ బాబు కు నరేంద్ర మోడీ ఉత్తరం..ఫుల్ హ్యాపీ
హైదరాబాద్ : మోహన్ బాబు తన కుమారుడు మంచు మనోజ్ వివాహం కోసం..కొద్ది రోజుల క్రితం వ్యక్తిగతంగా నరేంద్రమోది ని కలిసి శుభలేఖ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన బిజీ షెడ్యూల్ లో రాలేకపోయారు. అయితే విషయం మర్చిపోకుండా...నూతన వధూవరులకు ఆయన శుభాకాంక్షలు తెలియచేస్తూ...ఉత్తరం రాసారు. ఈ విషయాన్ని మోహన్ బాబు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా తెలియచేసారు.
మోహన్ బాబు ట్వీట్ చేస్తూ... ప్రధానమంత్రి నరేంద్రమోది నుంచి ఉత్తరం అందుకున్నాను. నూతన వధూవరులను ఆశ్వీరదిస్తూ రాసిన అందమైన ఉత్తరం అది. అంత బిజీ షెడ్యూల్ ల్ లోకూడా ఆయన ఈ విషయం గుర్తు పెట్టుకుని స్పందించి శుభాకాంక్షలు తెలియచేటం చాలా ఆనందంగా ఉంది. యువకులు, ఔత్సాహిక రాజకీయనాయకులు ...నరేంద్రమోదీ గారి నుంచి చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగ ఆయన ఎలా లీడర్ అయ్యారు..స్నేహితుడుగా, ఓ సోదరుడు గా ఎలా ఉంటూ వస్తున్నారు అనేది అన్నారు.
Honored
to
have
received
a
letter
from
our
PM
@narendramodi.
Beautiful
letter
blessing
the
newly
weds.In
such
busy
schedule
he
did
remember!
—
Mohan
Babu
M
(@themohanbabu)
May
21,
2015
Youngsters
and
upcoming
politicians
should
learn
a
lot
from
Shri
@narendramodi
ji.
Mainly
on
how
to
be
a
leader,
friend
and
a
brother.
—
Mohan
Babu
M
(@themohanbabu)
May
21,
2015
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
బుధవారం హైదరాబాద్లో హైటెక్స్ ప్రాంగణంలో మంచు మనోజ్ పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. సరిగ్గా ఉదయం 9గంటల 10 నిమిషాలకు మనోజ్ ప్రణతి మెడలో మూడుముళ్లు వేశాడు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన అతిరథ మహారథులు ఈ వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మోహన్బాబు ప్రేమతో 'గురువుగారూ..' అని పిలుచుకొనే దాసరి నారాయణరావు సమక్షంలో మనోజ్ పెళ్లి జరిగింది.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర్రావులతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు, కేంద్ర మాజీ మంత్రి సుశీల్కుమార్ షిండే వచ్చారు.
అలాగే రామోజీరావు, రామోజీ ఫిల్మ్సిటీ మేనేజింగ్ డైరెక్టర్లు రామ్మోహన్రావు, విజయేశ్వరి, తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, జగదీష్రెడ్డి, సినీ ప్రముఖులు రజనీకాంత్, అంబరీష్, కె.రాఘవేంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేష్బాబు, ప్రభాస్, సూర్య, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.