Don't Miss!
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పెదరాయుడికి రెండు దశాబ్దాలు: ఇక మోహన్ బాబు కన్నప్ప కథ
హైదరాబాద్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మించిన నటించిన పెదరాయుడు చిత్రం రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుంది. ఇప్పుడు డా.మోహన్ బాబు నిర్మాతగా ‘కన్నప్ప కథ' చిత్రం రూపొందుతోంది. ఎనిమిది దశాబ్దాలను పూర్తి చేసుకున్న టాలీవుడ్ లో ఎన్నో మరపురాని చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశాయి.
అటువంటి మేటి చిత్రాల్లో కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు నిర్మిస్తూ, నటించిన చిత్రం పెదరాయుడు ఒకటి. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మోహన్ బాబు ఆప్త మిత్రుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించడం విశేషం. కుటుంబంలో బంధాలు, అనుంబంధాలు గురించి గొప్పగా చాటి చెప్పిన ఈ చిత్రంలో పెదరాయుడుగా మోహన్ బాబు నటన అద్వితీయం. ఈ చిత్రం ఇరవై వసంతాలను పూర్తి చేసుకుంది.
లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం తెలుగు సినిమా దశ, దిశను మార్చిన చిత్రంగా నిలిచిపోయింది. ఆ సినిమాలోని ప్రతి డైలాగ్ ఇప్పటికీ, ఎప్పటీకీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసి నిలిచిపోయాయి. పెదరాయుడుగా తెలుగు ప్రజలను అలరించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పుడు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భారతదేశంలోని అన్నీ భాషల్లో ‘కన్నప్ప కథ'చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పరమశివుని మహాభక్తుడిగా పేరు పొందిన కన్నప్ప గురించి తెలియని తెలుగువాడుండడు. ఆయన భక్తికి తార్కాణమే శ్రీ కాళహస్తీశ్వరాలయం. శివుని పరమవీర భక్తునిగా పేరు పొందిన కన్నప్ప పాత్రలో యంగ్ అండ్ డైనమిక్ హీరో మంచు విష్ణు నటించనున్నారు. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ, హాలీవుడ్ స్టూడియో భాగస్వామ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నామని డా.మోహన్ బాబు తెలియజేశారు.