Don't Miss!
- News నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు, ఇది వాళ్లపనే అని నాకు తెలుసు !
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వాళ్లని తాకితే పోతుందా?...మోహన్ బాబు కొత్త వివాదం
హైదరాబాద్ : సినీ నటుడు మోహన్ బాబు ఈ మధ్య పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఆయన వ్యాఖ్యలు స్వామీజీలను ఉద్దేశించి ఉండటమే ఇందుకు కారణం. ఇంతకీ మోహన్ బాబుకు వచ్చిన డౌట్ ఏంటని అనుకుంటున్నారా?
రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామి రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 20 ఆలయాలకు చెందిన అర్చకులను విశాఖపట్నంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి పలువురు పీఠాధిపతులు, సినీనటులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు పలువురు స్వామీజీలకు పాదాభివందనం చేసారు. అయితే పాదాలను తాకాలని ప్రయత్నించిన మోహన్ బాబుకు సదరు స్వామీజీలు ఆ ఛాన్స్ ఇవ్వలేదట.
దీనిపై మోహన్ బాబు స్పందిస్తూ...అనేక మంది స్వామీజీలకు పాదాభివందనం చేసేందుకు పాదాలను తాకాలని ముందుకు వంగితే వారు వెనక్కి తీసుకుంటున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. తాము అంటరానివారం కాదని... తాము ముట్టుకుంటే శక్తి పోతుందంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రశ్న అడిగినందుకు తనను వేరే విధంగా అనుకోవద్దని మోహన్ బాబు పీఠాధిపతులను కోరారు.