Don't Miss!
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చంద్రశేఖర్ యేలేటి కొత్త చిత్రం ప్రారంభమైంది..టైటిల్ ఏంటంటే
హైదరాబాద్ :మోహన్లాల్, గౌతమి ప్రధాన పాత్రల్లో వారాహి చలన చిత్రం సంస్థ రూపొందిస్తున్న చిత్రం 'మనమంతా'. చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు. రజనీ కొర్రపాటి నిర్మాత. హైదరాబాద్లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సాయి కొర్రపాటి క్లాప్నిచ్చారు. ఈ రోజు(సోమవారం) నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు.
''మధ్యతరగతి జీవితానికి ప్రతిబింబంగా నిలిచే కథ ఇది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నామ''అని చిత్ర యూనిట్ తెలిపింది.
ముహుర్తపు సన్నివేశాన్ని దేవుని పటాలపై చిత్రీకరించారు. వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి క్లాప్ కొట్టి, స్క్రిప్ట్ను దర్శకుడు చంద్రశేఖర్ యేలేటికి అందించారు. రేపటి నుండి సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకోనుంది. వేర్వేరు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నలుగురు భిన్నమైన వ్యక్తుల కథే ఈ చిత్రమని తెలియజేశారు.
మోహన్ లాల్, గౌతమి, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, అయ్యప్పశర్మ, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: చంద్రశేఖర్, ఆర్ట్: రవీందర్, కెమెరా: రాహుల్, మ్యూజిక్: మహేష్ శంకర్, నిర్మాత: రజనీ కొర్రపాటి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి.