Don't Miss!
- News జగన్ Vs పవన్, సమర్ధతకు పరీక్ష - దక్కేదెవరికి..!!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
‘మామ్’ తర్వాత శ్రీదేవి మరో సంచలనం...!
శ్రీదేవి-అనిల్ కపూర్ సూపర్ హిట్ మూవీ ‘మిస్టర్ ఇండియా’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్: శ్రీదేవి, అనిల్ కపూర్ కాంబినేషన్లో వచ్చిన 'మిస్టర్ ఇండియా' అప్పట్లో బాలీవుడ్లో సంచలన విజయం సాధించింది. సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరోగా ఫిల్మ్ గా 30 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం ఆ రోజుల్లో బాలీవుడ్లో హయ్యెస్ట్ గ్రాసర్గా చరిత్ర సృష్టించింది. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది.
'మిస్టర్ ఇండియా' సినిమాను అనిల్ కపూర్ సోదరుడు బోనీ కపూర్ నిర్మించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే నిర్మాత బోనీ కపూర్తో శ్రీదేవి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'మామ్' సినిమాతో బిజీగా ఉన్న శ్రీదేవి ఈ చిత్రం తర్వాత 'మిస్టర్ ఇండియా-2'లో నటించబోతోందట.
అవే పాత్రల్లో అనిల్, శ్రీదేవి
త్వరలో ‘మిస్టర్ ఇండియా-2' చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని... ఇందులో శ్రీదేవి, అనిల్ కపూర్ అదే పాత్రల్లో నటించబోతున్నారని తెలుస్తోంది.
హర్షవర్దన్ కపూర్
అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కపూర్‘మీర్జా' సినిమా ద్వారా హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. కుమారుడికి మంచి కమర్షియల్ హిట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంలో ‘మిస్టర్ ఇండియా-2' చిత్రాన్ని హర్షవర్దన్ హీరోగా ప్లాన్ చేస్తున్నాడట అనిల్ కపూర్.
దర్శకుడు ఎవరు?
మిస్టర్ ఇండియా చిత్రానికి దర్శకత్వం వహించిన శేఖర్ కపూర్... సీక్వెల్కు దర్శకత్వం వహించేందకు నిరాకరించినట్లు సమాచారం. దీంతో వేరొకరితో ఈ సినిమా చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ‘బాగ్ మిల్ఖా బాగ్' డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా లేదా ‘మామ్' దర్శకుడు రవి ఉడియార్ చేతికి ‘మిస్టర్ ఇండియా-2' ప్రాజెక్టు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
త్వరలో మరిన్ని వివరాలు
‘మిస్టర్ ఇండియా-2' చిత్రం ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉంది. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని విషయాలు వెల్లడి కానున్నాయి. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించబోతున్నట్లు సమాచారం.