Don't Miss!
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
ఎమ్మెస్ నారాయణ ఇంట్లో మరో విషాదం
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ కమెడియన్లలో ఒకరైన ఎంఎస్ నారాయణ సరిగ్గా ఏడాది క్రితం అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబం ఇంకా విషాదం నుండి తేరుకోక ముందే మరో విషాదం చోటే చేసుకుంది.
ఎంఎస్ సతీమణి కళాప్రపూర్ణ (63) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంత కాలంగా గుండె సంబంధ వ్యాధితో బాధ పడుతున్న ఆమె సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితమే ఎంఎస్ మొదటి వర్థంతి జరిగింది.
ఎమ్మెస్ బ్రతికున్న సమయంలో తన భార్య గురించి మాట్లాడుతూ...తమది ప్రేమ వివాహం, తన దగ్గరకు ట్యూషన్ కు వచ్చే స్టూడెంట్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెద్దలు మా పెళ్లికి ఒప్పుకోక పోవడంతో తన లెక్చరర్ అయిన పరుచూరి గోపాల క్రిష్ణ తమ పెళ్లి చేసారని, తాను సినిమాల్లోకి రావడానికి తన భార్య ప్రోత్సాహం చాలా ఉందని ఎమ్మెస్ తెలిపారు.
తాను సినిమా అవకాశాల కోసం కష్టపడిన సమయంలో తన భార్య కళాప్రపూర్ణ ఇంటి బాధ్యతలు చూసుకునేది, ఆమె సహాయం లేకుండా నేను ఇంతవాన్ని అయ్యేవాన్ని కాదు అని ఎమ్మెస్ అప్పట్లో అనేవారు.