Don't Miss!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
క్యాన్సర్తో కన్నుమూసిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్
ముంబై: బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు ఆదేశ్ శ్రీవాత్సవ(51) క్యాన్సర్ తో కన్నుమూసారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన అందేరిలోని కోకిలాబెన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి దాటిని తర్వాత 12.30 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. 2011 నుండి ఆదేశ్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. అయితే గత 40 రోజులు నుండి వ్యాధి తీవ్రత ఎక్కువైంది.
కెరీర్లో ఆదేశ్ శ్రీవాత్సవ దాదాపు 70కి పైగా చిత్రాలకు చిత్రాలకు సంగీతం అందించారు. ఛల్తే ఛల్తే, బాగ్బన్, కబీ ఖుషీ కబీ గమ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. తాజాగా విడుదలైన వెల్ కం బ్యాక్ ఆయన సంగీతం అందించిన చివరి సినిమా. కొన్ని చిత్రాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు.
గాయకుడిగానూ సినీ రంగానికి తన సేవలు అందించారు. మాజీ నటి విజేత పండింత్ ను వివాహమాడిన ఆయనకు అనివేష్, వితేష్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఆదేశ్ ఆసుపత్రిలో ఉండగా పలువురు సినీ ప్రముఖులు వచ్చి పరామర్శించి వెళ్లారు. ఆయన మరణంతో బాలీవుడ్ సంగీత ప్రపంచం విషాదంలో మునిగి పోయింది.