Don't Miss!
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శ్రీదేవి కూతురుతో అఖిల్కు లింక్.... స్పందించిన నాగార్జున!
అఖిల్ రెండో సినిమాపై వచ్చిన పుకార్లను నాగార్జున ఖండించారు. శ్రీదేవి చిన్న కూతురు ఈచిత్రంలో నటిస్తున్న వార్తలు నిజం కాదన్నారు.
హైదరాబాద్: తన కుమారుడు అక్కినేని అఖిల్ విషయంలో ప్రచారంలోకి వస్తున్న పుకార్లను నాగార్జున ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు. తాజాగా అఖిల్ రెండో సినిమా విషయంలో వచ్చిన రూమర్స్ ఆయన వెంటనే ట్విట్ట్ ద్వారా ఖండించారు.
'అఖిల్ కోసం శ్రీదేవి కూతురిని ఎంపిక చేసుకోవాలనుకుంటున్న నాగార్జున' అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు కావడంతో .... ఇది నిజం కాదని, ఇలాంటి పుకార్లు నమ్మవద్దని నాగార్జున ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
అఖిల్ తెరంగ్రేటం చేసిన తొలి సినిమా బాక్సాఫీసు వద్ద ఫెయిల్ కావడంతో.... అఖిల్ను హీరోగా నిలబెట్టేందుకు నాగార్జున స్వయంగా బాధ్యత తీసుకున్న సంగతి తెలిసిందే. అఖిల్ రెండో మూవీ తానే స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో నిర్మిస్తున్నారు.
అక్కినేని ఫ్యామిలీ సూపర్ హిట్ 'మనం' చిత్రానికి దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ను హీరోయిన్గా తీసుకుంటున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నాగార్జున స్పందిస్తూ అది నిజం కాదన్నారు.