Don't Miss!
- Lifestyle ప్రేమ విషయంలో ఈ రాశులను మాత్రం అస్సలు నమ్మకూడదు..నమ్మక ద్రోహం చేస్తారు..
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నాగార్జున-డాలీ కాంబినేషన్ ఖరారు చేసిన బెల్లంకొండ
హైదరాబాద్ : కింగ్ నాగార్జున హీరోగా 'తడాఖా' ఫేమ్ కిషోర్ పార్దాసాని(డాలీ) దర్శకత్వంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ శ్రీసాయి గణేష్ ప్రొడక్షన్స్ బేనర్పై ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మీడియాకు ఈ విషయంపై అధికారిక ప్రకటన చేసారు.
ఈ సినిమా గురించి బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ 'నాగ చైతన్య, సునీల్ కాంబినేషన్లో మా బేనర్లో డాలీ డైరెక్ట్ చేసిన 'తడాఖా' సూపర్ హిట్టయింది. 'తడాఖా' చిత్రాన్ని చూసి డాలీ టాలెంటుకు ఎంతో ఇంప్రెస్ అయిన నాగార్జున డాలీ డైరెక్షన్లో సినిమా చేయ్యమని అడిగిన వెంటనే ఒప్పుకున్నారు' అని తెలిపారు.
'నాగార్జనకు అన్ని విధాలా సరిపోయే అద్భుతమైన సబ్జెక్టును డాలీ రెడీ చేసారు. మా బేనర్లో నాగార్జున గారితో ఓ సెన్సేషన్ మూవీ తియ్యాలన్న కోరిక ఈ చిత్రంతో నెరవేరబోతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాము' అని బెల్లంకొండ సురేష్ మీడియాకు తెలియజేసారు.
డాలీ దర్శకత్వంలో నాగ చైతన్య, సునీల్, తమన్నా, ఆండ్రియా హీరో హీరోయిన్లుగా రూపొందిన 'తడాఖా' చిత్రం ఇటీవల విడుదలైన చిత్రం బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనే టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తమిళంలో హిట్టయిన 'వెట్టై' చిత్రానికి రీమేక్గా దీన్ని తెరకెక్కించారు.