Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రామ్ చరణ్ ఫేసే బుక్ కు స్పెషల్ నోటిఫికేషన్ వచ్చింది, అదేమిటంటే.. (వీడియో)
హైదరాబాద్: అందరికీ నమస్కారం, నా ఫేస్ బుక్ కు ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చింది అదేంటో మనం చూద్దాం అంటూ రామ్ చరణ్ ఆసక్తిగా మనల్ని పిలుస్తూ తన ఫేస్ బుక్ పేజిని ఓపెన్ చేసారు. ఇంతకీ ఆ నోటిఫికేషన్ ఏమిటి, దేని గురించి ఈ బిల్డప్ అనేది క్రింద చూడండి.
ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ తాజాగా నక్షత్రం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్, రెజీనా ప్రధాన పాత్రలలో నక్షత్రం అనే సినిమా తెరకెక్కుతుండగా ఈ మూవీపై అభిమానుల్లో ఫుల్ హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కృష్ణవంశీ. ఈ చిత్రానికి సంబంధించిన టెన్ లుక్స్ ని విడుదల చేస్తున్నామంటూ కృష్ణ వంశీ ఇటీవల ఓ వీడియో పోస్ట్ చేశాడు.
ఈ చిత్రం ఫస్ట్లుక్ను హీరో రామ్చరణ్ శనివారం విడుదల చేశారు. ఫస్ట్లుక్ బావుందంటూ.. మొత్తం యూనిట్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ వీడియోను కృష్ణ వంశీ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
శ్రీ చక్ర మీడియా పతాకంపై కె. శ్రీనివాసులు, ఎస్. వేణుగోపాల్, సజ్జు 'నక్షత్రం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన రెజీనా నటిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ చిత్రంలో పోలీసు అధికారిగా అతిథి పాత్రలో కనిపించనున్నారు.
సాయిధరమ్ పోలీస్ పాత్రలో కనిపించనుండగా ప్రగ్యా జైస్వాల్ కూడా ఓ కీలక పాత్ర పోషించనుంది. యంగ్ హీరో తనీష్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.
ఇక సందీప్ కిషన్ ఈ సినిమాలో ఓ కానిస్టేబుల్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. పోలీస్ అవ్వడమే ధ్యేయంగా ఎదిగిన ఓ కుర్రాడు మొదట కానిస్టేబుల్ గా తన కెరీర్ ను ఆరంభించి.. ఆ తర్వాత ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది "నక్షత్రం" చిత్ర కథాంశం అని తెలుస్తోంది!
ఈ మూవీలో కొన్ని యాక్షన్ సన్నివేశాల్ని డూప్స్ లేకుండా చేసిన సందీప్ ఓ కార్ ఛేజింగ్ సన్నివేశాన్ని చేసేందుకు ఎలాంటి సెక్యూరిటీ కోరలేదట. ఇందులో కార్లన్నీ 150 కి. మీ వేగంతో వెళుతుంటే సందీప్ తన కారుతో వాటికి ఎదురుగా వెళతాడట. ఈ సన్నివేశం సినిమాలో హైలెట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక కొన్ని సన్నివేశాలలో సందీప్ మేకప్ లేకుండానే కనిపిస్తాడని సమాచారం.
అలాగే ఈ చిత్రంలో లంబాడీ పిల్ల గా రెజీనా కనిపించనుండగా.. ఆ పాత్రలో ఒదిగేలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్. ఏదేమైన మంచి కసితో ఈ సినిమా చేస్తోన్న కృష్ణవంశీ మంచి హిట్ కొడతాడని అంటున్నారు. ఇందులోని నటీనటులకు కూడా మంచి గుర్తింపు వస్తోందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.