Don't Miss!
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- News Iran Israel War: ఇరాక్ నూ కెలికిన ఇజ్రాయెల్? ఇరాన్ ఉమ్మడి పోస్టుపై దాడి-పోరు తీవ్రం..!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
విషాదం లో బాలకృష్ణ:నందమూరి వీరాభిమాని మృతి
బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాశిం(53) బుధవారం అర్థరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. నందమూరి కుటుంబానికి ఎప్పటినుంచో అభిమానిగా ఉంతూ బాలకృష్ణ ప్రతీ పుట్టిన రోజుకీ, ప్రతీ సినిమా రిలీజ్ కీ సేవా
బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాశిం(53) బుధవారం అర్థరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. నందమూరి కుటుంబానికి ఎప్పటినుంచో అభిమానిగా ఉంతూ బాలకృష్ణ ప్రతీ పుట్టిన రోజుకీ, ప్రతీ సినిమా రిలీజ్ కీ సేవా కార్యక్రమాలని చేపట్టే నంద్యాలలోని నూనెపల్లె వీధికి చెందిన ఖాశిం ఎన్టీ రామారావు హయాం నుంచి నందమూరి కుటుంబానికి సన్నిహితుడు.
బాలకృష్ణకు వీరాభిమాని కావడంతో బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఖాశిం 75 సార్లు రక్తదానం చేసి రికార్డు సృష్టించాడు. సీఎం చంద్రబాబు నాయుడు, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్బాబు చేతుల మీదుగా ఎన్నో పురస్కారాలు, బహుమతులు ఖాశిం అందుకున్నాడు.
బుధవారం రాత్రి ఇంట్లో ఉండగా గుండె పోటు వచ్చింది. కుటుంబ సభ్యులు స్థానిక సురక్ష ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ వార్తని వినగానే బాలయ్య తీవ్రంగా మనస్తాపం చెందారని సమాచారం. అయితే ఇంకా బాలకృష్ణ స్పందన అదికారికంగా బయటకు రాలేదు.
మాజీ మంత్రి ఫరూక్, భూమా బ్రహ్మానందరెడ్డి సంతాపంటీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎనఎండీ ఫరూక్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఖాశిం మృతదేహానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతిని తెలిపారు. టీడీపీ యువ నాయకుడు భూమా బ్రహ్మానందరెడ్డి, పట్టణంలోని వివిధ సినిమా థియేటర్ల యజమానులు, సినీ నటుడు బాలకృష్ణ పీఏ తుమ్మినేని శ్రీనివాసరావు, పట్టణంలోని టీడీపీ నాయకులు హాజరై నివాళి అర్పించారు. గురువారం సాయంత్రం స్థానిక సాయిబాబానగర్లోని శ్మశాన వాటికలో ఖాశిం అంత్యక్రియలు నిర్వహించారు.