Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నందు నూతన చిత్రం 'కన్నుల్లో నీ రూపమే'
యంగ్ టాలెంటెడ్ హీరో నందు నూతన చిత్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. ఏ.ఎస్.పి క్రియేటివ్ ఆర్ట్స్ పతాకం పై భాస్కర్ భాసాని నిర్మాతగ నూతన దర్శకుడు బిక్స్ ఇరుసడ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జూన్ 15 నుంచి సెట్స్ పైకి రాబోతున్న ఈ చిత్రంలో నందు సరసన కన్నడ భామ తేజస్వినీ ప్రకాష్ హీరోయిన్ గా ఎంపికైంది.
హార్ట్ టచ్చింగ్ లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందబోతున్న ఈ సినిమాకు 'కన్నుల్లో నీ రూపమే' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫొటో, 100%లవ్, ఆటోనగర్ సూర్య, 365 డేస్ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నందు ఈ సినిమాలో ఓ విభన్నమైన పాత్రతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అలానే ఈ సినిమాతో తేజస్వినీ తెలుగు చిత్ర సీమకి పరిచయం అవుతోంది.
ఇప్పటికే ఈ బ్యూటీ కన్నడలో పలు చిత్రాల్లో నటించి విశేష గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్న బిక్స్ ఇరుసడ్ల చిత్ర కథచాలా అద్భుతంగా మలిచాడని, అలానే సంగీత దర్శకుడు సాఖేత్ కంపోజ్ చేస్తోన్న పాటలు కచ్ఛితంగా ప్రేక్షకుల్ని అలరిస్తాయని నిర్మాత భాస్కర్ భాసాని తెలిపారు. జూన్ 15 నుంచి షూటింగ్ మొదలుపెట్టి సాధ్యమైనంత త్వరగా అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకనిర్మాతలు తెలియజేశారు.