Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సినిమా నటిగా... నన్నపనేని రాజకుమారి
ఇటీవలే ఆమెపై ఈ సన్నివేశాలను చిత్రీకరించినట్లు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈచిత్రం నిర్మాణానంతర పనుల్లో భాగంగా ప్రస్తుతం రీరికార్డింగ్ శరవేగంగా జరుపుకుంటోందని తెలిపారు. త్వరలోనే ఆడియో, జనవరిలో సంక్రాంతి సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నామని చెప్పారు.
చిత్ర సమర్పకుడు దొరస్వామిరాజు మాట్లాడుతూ కథకు ప్రధాన్యమిస్తున్న చిత్రమిదని పేర్కొనగా, వినోదాత్మక కుటుంబ కథా చిత్రమని, ఇందులో ఐదు పాటలు ప్రేక్షకులను అతరిస్తాయని దర్శకుడు ఉదయభాస్కర్ తెలిపారు. ఇంకా ఈ చిత్రంలో కృష్ణుడు, అశోక్ కుమార్, వైజాగ్ ప్రసాద్, సన, చంటి తదితరులు తారాగాణం.
ఈ చిత్రానికి సంగీతం: అర్జున్, ఛాయాగ్రహణం: శివరాంరెడ్డి, ఆర్ట్: విజయకృష్ణ, ప్రొ.కంట్రోలర్: పి.వి.శాస్త్రి, సమర్పణ: వి.దొరస్వామిరాజు, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఉదయ్ భాస్కర్ పి.
తారకరత్న ప్రస్తుతం ఈ చిత్రంతో పాటు 'చూడాలని చెప్పాలని' చిత్రంలో కూడా నటిస్తోంది. ఇందులో మాధవి లత హీరోయిన్ ఈ చిత్రం కూడా త్వరలో విడుదల కానుంది. అదే విధంగా తారకరత్న హీరోగా 'ఎదురులేని అలెగ్జాండర్' చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది.