Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నారా రోహిత్ ‘అసుర’ ఫస్ట్ లుక్(మోషన్ పోస్టర్)
హైదరాబాద్ : తొలి నుంచీ ప్రతీ సినిమాకూ తన దైన శైలిలో వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకోవడంలో.. సరికొత్త పాత్రలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచటంలో ముందుంటున్నాడు నారా రోహిత్. తాజాగా ఈ యంగ్ హీరో నటిస్తున్న చిత్రం ‘అసుర'. ‘గుడ్ ఈజ్ బ్యాడ్' అనేది ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడుదలయ్యింది. ఫస్ట్ లుక్ తోనే అందరినీ ఆకట్టుకున్న ఈ మోషన్ పోస్టర్ పై మీరూ ఓ లుక్కేయండి
ఈ సినిమాలో నారా రోహిత్ జైలర్ గా నటించారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, డిఫరెంట్ కథతో ‘అసుర' సినిమా ఉంటుందని చెప్తున్నారు. అలాగే తన కేరక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుందని అంటున్నాడు. చాలా ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పాటలు షూటింగ్ బాలన్స్ ఉంది. కమర్షియల్ హంగులతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. అని నారా రోహిత్ తెలిపారు.
హీరోయిన్ విషయానికి వస్తే... అడవి శేష్ సరసన ‘కిస్' సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియా బెనర్జీ తెలుగులో మరో అవకాశం సొంతం చేసుకుంది. విజయ్ లింగమనేని దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా తెరకేక్కబోయే కొత్త సినిమాలో ప్రియా బెనర్జీని హీరోయిన్ గా చేస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రియా బెనర్జీ ట్రెడిషనల్ అమ్మాయిగా నటిస్తుంది. ఈ సినిమాలో అవకాశం రావడం పట్ల ప్రియా సంతోషం వ్యక్తం చేసింది.
‘కిస్' తర్వాత సందీప్ కిషన్ ‘జోరు'లో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా ప్రియా బెనర్జీ నటించింది. ‘జోరు' చిత్రీకరణ సమయంలో ఆమె నటన నచ్చడంతో నారా రోహిత్ సినిమా దర్శకనిర్మాతలకు రికమండ్ చేశారు.
కృష్ణ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా బెనర్జీ హీరోయిన్. జేమ్స్ మధు, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. నారా రోహిత్ సమర్పణలో శ్యామ్ దేవభక్తుని ఈ సినిమాను నిర్మించారు.