Don't Miss!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
త్రిషతో కలిసి పార్టీ చేసుకున్న నయనతార (ఫోటో)
హైదరాబాద్ : సౌతిండియా స్టార్ హీరోయిన్ నయనతార మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. 2012లో నయనతార, మరో స్టార్ హీరోయిన్ త్రిష మధ్య విబేధాలు పొడచూపాయి. అప్పట్లో వీరి మధ్య ఓ రేంజిలో కాంపిటీషన్ ఉండటమే అందుకు కారణం. తాజాగా వీరిద్దరూ మళ్లీ కలిసారు.
నయనతార, త్రిష ఇద్దరూ కలిసి తాజాగా ఓ పార్టీలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని త్రిష తన ట్విట్టర్ ద్వారా వెల్లడించడంతో పాటు ఫోటో కూడా పోస్టు చేసింది. మళ్లీ నయనతారతో కలవడం ఆనందం ఉందంటూ ట్వీట్ చేయడంతో పాటు ఇద్దరూ మంగళవారం రాత్రి పార్టీలో పాల్గొన్న ఫోటోను కూడా పోస్టు చేసింది.
నయనతార గత కొంత కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. పలువురు హీరోలతో తనకు ఉన్న సంబంధాలపై మీడియా వారు గుచ్చి గుచ్చి అడుగు తుండటమే అందుకు కారణం. దీంతో మీడియాకు దూరంగా ఉంటూ స్నేహితులకు దగ్గరవుతోంది ఈ హాట్ బ్యూటీ.
ఇటీవల నయనతార ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాట్లాడుతూ...'ప్రస్తుతం తాను సింగిల్గా ఉన్నాను. ఇప్పుడు నాకు ఎలాంటి సమస్యలు లేవు. మీడియాలో వస్తున్న వార్తలతో చాలా విసుగు చెందాను' అని వెల్లడించారు. ప్రస్తుతం నయన తార పలు సినిమాలతో బిజీగా గడుపుతోంది.