Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సాహోలో విలన్గా బాలీవుడ్ హీరో.. ఇక ప్రభాస్తో ఢీ అంటే ఢీ..
బాహుబలి2 చిత్రం రిలీజ్ తర్వాత యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ నటించే సాహో చిత్రంపై భారీగా అంచనాలు పెరిగాయి.
బాహుబలి2 చిత్రం రిలీజ్ తర్వాత యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ నటించే సాహో చిత్రంపై భారీగా అంచనాలు పెరిగాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరుగడంతో ఆ స్థాయికి తగినట్టుగా సాహోను నిర్మించాలనే పట్టుదల మొదలైంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్లో అప్పుడప్పుడు హీరో పాత్రలు వేస్తూన్న నీల్ నితిన్ ముఖేష్ను విలన్గా ఎంపిక చేసినట్టు చిత్ర నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు.
సాహో కోసం సంతకం..
ప్రభాస్ తర్వాత ఈ సినిమా కోసం సంతకం చేసిన రెండో వ్యక్తి నీల్ నితిన్ ముఖేష్. ఈ చిత్రంలో విలన్ పాత్ర చాలా టెర్రిఫిక్గా ఉంటుంది. సాహోలో ప్రభాస్, నీల్ నితిన్ మధ్య జరిగే సన్నివేశాలు, పోరాటాలు ఆసక్తికరంగా ఉంటాయి. నీలి నితిన్ పాత్ర చాలా పవర్ ఫుల్ అని చిత్ర నిర్వాహకులు మీడియాకు తెలిపారు. ఈ చిత్రానికి సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
అమితాబ్, సల్మాన్ సినిమాల్లో..
బాలీవుడ్లో నీల్ నితిన్ ముఖేష్ ఇటీవల అమితాబ్ బచ్చన్ నటించిన వజీర్, సల్మాన్ ఖాన్ చిత్రం ప్రేమ్ రతన్ ధన్ పాయోలో సినిమాలో విలన్గా కనిపించాడు. ఆయన పోషించిన పాత్రలకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. వాస్తవానికి చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్ 150 చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్ నటించాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదనే ఇన్సైడ్ టాక్.
ఇటీవల వివాహం..
నీల్ నితిన్ ముఖేష్ వివాహం ఇటీవల రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగింది. తన ప్రేయసి రుక్మిణి సహాయ్ మెడలో మూడు మూళ్లు వేశాడు. వీరి వివాహం ఫిబ్రవరి 9న డెస్టినేషన్ మ్యారేజ్గా జరిగింది. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రంలో జై లవకుశలో కూడా ఈయన నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
ఇంకా తేలని హీరోయిన్ల వ్యవహారం
సాహో చిత్రానికి సంబంధించి.. హీరోయిన్ల వేట ఇంకా పూర్తి కాలేదనేది ఫిలిం నగర్ సమాచారం. దిశాపటానీ, శ్రద్ధాకపూర్ రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడంతో వారిని పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత హీరోయిన్గా కత్రినా కైఫ్ ఎంపికైందని, మరోసారి బాహుబలి హీరోయిన్ అనుష్కశెట్టి మరోసారి ప్రభాస్తో జతకట్టనున్నదనే వార్తలు జోరందుకున్నాయి.