Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దిల్ రాజు భలే స్కెచ్ వేశాడు.. రాజ్ తరుణ్కు చెక్ నానికి ఛాన్స్
దర్శకుడు నక్కిన త్రినాధ్ నేను లోకల్ సినిమాను రాజ్తరుణ్ హీరోగా చేద్దామనుకున్నాడట., కథ విన్న దిల్ రాజు కానీ దిల్ రాజు నాని నే కోరుకోవటం తో హీరో మారిపోయాడు.
టాలీవుడ్లో వరుస హిట్లతో జోరు చూపిస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత నాని సినిమాలకు అదిరిపోయే రేంజ్లో ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటికే ఐదు వరుస హిట్లతో ఉన్న నాని తన తాజా చిత్రం నేను లోకల్ సినిమాతో మరో హిట్ కొట్టి డబుల్ హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటాడన్న అంచనాలు ఉన్నాయి.
శుక్రవారం విడుదలైన నేచురల్ స్టార్ నాని 'నేను లోకల్' సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. యూఎస్ ప్రీమియర్ షోల ద్వారా కూడా ఈ సినిమా భారీగానే ఆర్జించింది. 'శతమానం భవతి' ఘనవిజయంతో మంచి జోష్లో ఉన్న దిల్ రాజుకు మరో విజయం లభించినట్టే. అయితే ఈ సినిమా దర్శకుడు నక్కిన త్రినాధ్ ఈ కథను రాసింది నానిని దృష్టిలో ఉంచుకుని కాదట. కథ రాసేటప్పుడు అసలు సీన్లో నాని లేనేలేడు.
ఈ సినిమాను రాజ్తరుణ్ హీరోగా చేద్దామనుకున్నాడట. నిర్మాత బెక్కం వేణుగోపాల్ కూడా రాజ్తరుణ్ కే ఓటేయటం తో సినిమాకి హీరోగా రాజ్ ఓకె అనుకున్నాక అసలు మార్పు వచ్చిపడింది.. అయితే ఫైనాన్స్ కోసం దిల్ రాజు వద్దకు వెళ్లి కథ వినిపించాడట. కథ విన్న దిల్ రాజు ఈ కథ నానికి అయితే బాగుంటుందని,
రాజ్ తరుణ్ కన్నా నాని అయితేనే కథకి సూటబుల్ గా ఉండటం తో పాటు ఇప్పటికే మంచి రైజింగ్ లో ఉన్న నాని వల్ల బిజినెస్ కూడా బావుంటుందని చెప్పి, అందుకు అంగీకరిస్తేనే తాను ఆ టీమ్ లో చేరతానని చెప్పాడట. దీంతో ఈ సినిమా రాజ్ తరుణ్ నుంచి నాని చేతులోకి వెళ్లింది. అయితే సినిమా విడుదలయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూస్తె.. నానితో చేస్తేనే బాగుంటుందనే దిల్ రాజు అంచనా నిజమైందని ఇప్పుడు అంటున్నారు. ఒకవేళ రాజ్తరుణ్తోనే ఈ సినిమా చేసినట్టైతే సినిమా ఓకే అనిపించుకున్నా ఇప్పుడున్నంత హైప్ మాత్రం వచ్చేది కాదని అనుకుంటున్నారు...