Don't Miss!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
నితిన్..వెంకటేష్...నెక్ట్స్ ఎవరో
హైదరాబాద్: హిట్ వస్తే వచ్చే కిక్కే వేరు. 2016లో మెట్టమెదటి సూపర్డూపర్ హిట్ చిత్రం నేను శైలజ ని అందించిన దర్శకుడు కిషోర్ తిరుమల. ఈ దర్శకుడుకి అందరూ ఊహించినట్లుగానే వరస ఆఫర్స్ వస్తున్నాయి. నితిన్ తో సినిమా ప్రకిటించిన ఒక రోజు గడవక ముందే వెంకటేష్ తో సినిమా ఓకే చేసుకున్నారు. దాంతో రేపో మారో మరో హీరోతో సినిమా ప్రకటన వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.
దర్శకత్వంలో విక్టరి వెంకటేష్ హీరోగా, మల్టిడైమన్షన్ రామ్ మెహన్ ప్రోడ్యూసర్ గా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వం లో చేస్తున్న చిత్రం తరువాత ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళనుంది.
ఈ సందర్బంగా దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ" నేను శైలజ లాంటి సూపర్డూపర్ హిట్ చిత్రం తరువాత విక్టరి వెంకటేష్ గారితో నా తదుపరి చిత్రం వుంటుంది. వెంకటేష్ గారికి కథ చెప్పటం జరిగింది. వెంకటేష్ గారికి కథ నచ్చటంతో ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో వున్నాను. నా తదుపరి చిత్రం వెంకటేష్ గారితో చేస్తున్నందుకు ఆనందంగా వుంది. అలాగే ఇంత క్రేజి చిత్రాన్ని మల్టిడైమన్షన్ రామ్మెహన్ గారు నిర్మిస్తున్నారు.
నెను చెప్పిన కథ అందరికి నచ్చటంతో మిగతా కాస్టింగ్ పనుల్లో బిజిగా వున్నాను. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వెంకటేష్ గారు చేస్తున్న చిత్రం తరువాత మా చిత్రం సెట్స్ మీదకి వెలుతుంది. వెంకటేష్ గారి అభిమానులకి ఏలాంటి అంశాలుంటే ఎంజాయ్ చేస్తారో, అలాగే ఫ్యామిలి ఆడియన్స్ ఆయన నుండి ఏం కోరుకుంటారో అన్ని కమర్షియల్ అంశాలుంటూనే చక్కటి వినోదం వుంటుంది. ఈ చిత్రం లో చాలా ఇంట్రస్టిగ్ సెగ్మెట్స్ వుంటాయి. ఆ వివరాలు అతి త్వరలో మీకు తెలియజేస్తాము.." అన్నారు.