Don't Miss!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
మా 'శంకరాభరణం'... ఆ హిందీ సినిమా రీమేక్: కోన వెంకట
హైదరాబాద్: నిఖిల్, నందితలు జంటగా నటించిన చిత్రం 'శంకరాభరణం'. ఈ చిత్రం ఆడియో రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓ హిందీ చిత్రం రీమేక్ అంటూ కోన వెంకట్ తెలియచేసారు. ఆయన ఈ విషయం గురించి ఏమన్నారో క్రింద ట్వీట్ లో చూడండి.
The
original
idea
of
Shankarabharanam
is
taken
from
"Phas
gaya
re
obama"
&
woven
our
story
around
it.We
have
taken
rights
for
entire
south!!
—
kona
venkat
(@konavenkat99)
October
30,
2015
2010 లో విడుదలైన చిన్న సినిమా ఫస్ గయ రే ఒబామా అనే హిందీ చిత్రం అదారంగా తిసిన చిత్రం, దీనికి సంబందించిన సౌత్ రైట్స్ మోత్తం తిసుకున్నట్టు కొన వెంకట్ ఈ కింద ట్వీట్ ద్వారా తేలియజేసారు.
ఉదయ్ నందనవనం దర్శకత్వం వహిస్తున్న 'శంకరాభరణం' చిత్రీకరణ పూర్తి అయ్యింది. కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మాత. అంజలి ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రను పోషించారు. నిఖిల్, నందిత, అంజలిలతోపాటు సుమన్, సితార, రావు రమేష్, సప్తగిరి, సత్యం రాజేష్ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.
‘శంకరాభరణం'
విశేషాలకు
వస్తే...
కథ
ఎమిటంటే
,
హీరో
నిఖిల్
ఎన్.ఆర్.ఐ,
తనకు
సంబందిచిన
భుమిని
విడిపించుకోవాలని
వస్తాడు.
ఎలా
విడిపించుకున్నడన్నదే
కథ.
ఒరిజినాలిటి
మిస్
కాకుడదని
బీహర్
లో
చిత్రికరించారు.
ప్రముఖ తెలుగు సినీ రచయిత కోన వెంకట్ ఓ చిత్రాన్ని నిర్మించి విడుదలకు రెడీ అవుతునున్నారు. ఈ సారి ఆయన హీరో నిఖిల్ తో ముందుకు వెళ్తున్నారు.‘శంకరాభరణం' టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇది బీహార్ నేపధ్యంలో క్రైమ్ ప్రధానంగా సాగే థ్రిల్లర్.
ఈ చిత్రం ద్వారా ఉదయ్ నందనవనం అనే అతను దర్శకుడుగా పరిచయం అవ్వనున్నారు. అలాగే ప్రవీణ్ లక్కిరాజు ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. ఇంతకుముందు కోన వెంకట్..అంజలి ప్రధాన పాత్రలో గీతాంజలి అనే హర్రర్ కామెడీని నిర్మించి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా అన్ని రకాల ఎలిమెంట్ లతో డిఫెరెంట్ గా సాగుతుందని చెప్తున్నారు.
నిఖిల్ బాడీ లాంగ్వేజికి తగిన విధంగా కోన వెంకట్ కథ తయారు చేసారని అంటున్నారు. పూర్తి వినోదాత్మకంగా సాగే కమర్షియల్ ఎంటర్టెనర్ గా ఉంటూనేై క్రైమ్ ఎలిమెంట్ ఈ చిత్రంలో ఉండనుంది. సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తానరి తెలుస్తోంది. ఆయన కోసం కోన వెంకట్ స్పెషల్ క్యారెక్టర్ క్రియేుట్ చేసినట్లు తెలుస్తోంది. కధల ఎంపికలో నిఖిల్ చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు.
కోన వెంకట్ మాట్లాడుతూ -''నాటి 'శంకరాభరణం'కీ, ఈ 'శంకరాభరణం'కీ ఎలాంటి పోలికా ఉండదు. బీహార్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ కామెడీ కథకు ఈ టైటిలే బాగుంటుందని పెట్టాం. మనుషులు వెళ్లడానికి కూడా భయపడే ప్రమాదకరమైన లొకేషన్స్లో షూటింగ్ జరపామన్నరు. హీరోగా, నటుడిగా నిఖిల్ స్థాయిని పెంచే చిత్రం అవుతుందిని'' అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రచనాసహకారం: వెంకటేశ్ కిలారు, భవానీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్, కథ-స్క్రీన్ప్లే-మాటలు: కోన వెంకట్.