Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
సస్పెన్స్ వీడింది : మణిరత్నం చిత్రం పూర్తి డిటేల్స్ ఇవే
హైదరాబాద్ : తన కెరీర్ లో హిట్టై క్లాసిక్ గా మిగిలిన చిత్రాన్ని మణిరత్నం రీమేక్ చేసే పనిలో ఉన్నారు. అది మరేదో కాదు మౌనరాగం. ప్రముఖ మలయాళ నటుడు మమ్ముటీ కుమారుడు దుల్ఖర్ సల్మాన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి మణిరత్నం అధికారికంగా ఇప్పటివరకు చిన్న మాట కూడా మాట్లాడలేదు. అయినా అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. ఈ చిత్రానికి టైటిల్ కూడా ఇంకా ఖరారుకాలేదు. ఇందులో హీరోగా దుల్ఖర్ సల్మాన్ నటించనున్నారనేది మాత్రం ఖరారైంది.
హీరోయిన్గా మొదట ఆలియా భట్ అనుకున్నారు. ఇప్పుడు తాజాగా నిత్యామీనన్ సీన్ లోకి వచ్చింది. నిత్య, దుల్ఖర్ ఇద్దరూ కలిసి నటించిన ‘ఉస్తాద్ హోటల్' మంచి హిట్ కొట్టింది. వీరిద్దరూ బెస్ట్ ఆన్స్క్రీన్ పెయిర్గా వనితా ఫిల్మ్ అవార్డుకూడా అందుకున్నారు. ఇద్దరూ కలిసి నటించిన ‘హండ్రెడ్ డేస్ ఆఫ్ లవ్' త్వరలో విడుదల కాబోతోంది. అక్టోబర్ 6న ఈ సినిమా షూటింగ్ చెన్నయ్లో ప్రారంభించారని తెలుస్తోంది.
నిత్యా మీనన్ మాట్లాడుతూ... ‘‘మణిరత్నంలాంటి విజన్ ఉన్న దర్శకుడితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నేను నా కెరీర్ని ఎప్పుడూ ప్రత్యేకంగా ప్లాన్ చేయలేదు. అయినా చాలా సాఫీగా, ఆనందంగా సాగిపోతోంది'' అని అంటోంది నిత్యామీనన్. మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ సరసన నటిస్తోందీ భామ.
నిత్యామీనన్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు సంతకం చేసి రెండు నెలలైంది. కానీ నాలుగు రోజుల నుంచే ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాను. ప్రతి ఆర్టిస్ట్ని కంఫర్ట్గా ఎలా ఉంచాలో మణిరత్నంగారికి తెలుసు. అద్భుతమైన ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు'' అని చెప్పుకొచ్చింది. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ కలిసి మలయాళంలో ‘ఉస్తాద్ హోటల్' చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో ఈ జంట మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరిందని విమర్శకులు ప్రశంసించారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా పి.సి శ్రీరామ్ పనిచేస్తున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్గా పనిచేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ సఖి ఆఖరి చిత్రం. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహ్మాన్.