Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రారా, పోరా అనుకున్నాం,నాకు ఆత్మాభిమానం ఉంది : ఇళయరాజాపై ఎస్పీబాలూ స్పందన ఇలా
తాను స్వరపరిచిన పాటలను బాలూ ఇక మీదట తన అనుమతి లేకుండా పాడకూదదంటూ సంగీత దర్శకుడు ఇళయ రాజా నోటీసులు పంపిన విషయం మీద బాలూ మరో సారి స్పందించారు.
తాను స్వరపరిచిన పాటలను బాలూ ఇక మీదట తన అనుమతి లేకుండా పాడకూదదంటూ సంగీత దర్శకుడు ఇళయ రాజా నోటీసులు పంపిన సంగతి సినీ ప్రపంచం లో ఒక దుమారమే రేపింది.. ఈ విశయం మీద బాలూ మరో సారి స్పందించారు. సంగీత దర్శకుడు ఇళయరాజాతో తనకెలాంటి బేధాభిప్రాయాలు లేవని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
వీరిద్దరి మధ్య ప్రేమ,అభిమానం
ఇళయరాజా సంగీతం ,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట గురించి పరిచయం అవసరం లేదు. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే పాటలు అంటే అభిమానులకు.సంగీత ప్రియులకు ఎంతో ఇష్టం. అంతేకాకుండా వీరిద్దరి మధ్య ప్రేమ,అభిమానం అనేక సంధర్బాలలో వేదికపై ప్రపంచానికి తెలియజేసారు.
సంచలనం రేకెత్తించింది
కాగా తాను స్వరపరిచిన గీతాలను ఆలపించడం సరికాదంటూ బాలుకు ఇళయరాజా నోటీసులు పంపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయం సినీ వర్గాల్లో సంచలనం రేకెత్తించింది.కొత్తతరం గాయకులు రావడంతో కొంతకాలంగా ప్లేబ్యాక్ సింగింగ్కు దూరంగా ఉన్న ఎస్పీబీ దేశ విదేశాల్లో షోలు నిర్వహిస్తున్నారు.
లీగల్ నోటీసులు
తాజాగా అమెరికాలోని సీటల్, లాస్ ఏంజిల్స్ నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యంకి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఇలాంటి నోటీసులు ఇవ్వవచ్చని కూడా చాలామందికి ఈ ఉదంతం వల్లే తెల్సింది కూడా
ఇళయరాజా వర్సెస్ బాలు
ఇళయరాజా వర్సెస్ బాలు ఎపిసోడ్లో రెండు వర్గాలుగా చీలిపోయారు. కొందరు ఇళయరాజాను సమర్దిస్తే.. మరికొందరు బాలును సమర్దిస్తూ మాట్లాడారు. దీంతో ఈ ఇష్యూ మీద తీవ్ర చర్చ నడుస్తోంది. ఇళయరాజా నోటీసులపై తనదైన శైలిలో స్పందించిన బాలు.. అంతలోనే రియాక్ట్ అయి.. ఈ ఇష్యూను మరో స్టేజ్ కి తీసుకెళ్లారు.
అందరూ శ్రమిస్తేనే
ఓ పాట వెనుకచాలామంది కష్టం ఉంటుందని.. దర్శకుడు.. నిర్మాత.. సంగీత దర్శకుడు.. సింగర్.. వాయిద్యకారులు ఇలా చాలామందేఉంటారని.. అలాంటప్పుడు హక్కులు మొత్తం సంగీతదర్వకుడికి ఇవ్వాలనటం సరికాదని.. అందరూ కలిసికట్టుగా శ్రమిస్తేనే సినిమా బయటకు వస్తుందని.. సినిమాలో ఒక సన్నివేశమైనా.. పాట అయినా.. దాని వెనుక సమిష్ఠి కష్టం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదని.. తాను చెప్పాల్సిన మాటను చెప్పేశారు.
గాయకుడిగా 50 వసంతాలు
గాయకుడిగా 50 వసంతాలను పూర్తి చేసుకున్న ఆయన తన గోల్డెన్ జూబ్లీని పురస్కరించుకుని తన సంగీత కళాకారుల బృందంతో కలిసి విదేశాల్లో సంగీత విభావరి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే సంగీత కచేరిల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పాటలను పాడకూడదని ఇళయరాజా అనూహ్యంగా నిషేధం విధించడం, అందుకు నోటీసులు పంపడం వివాదంగా మారడం, సినీ వర్గాల్లో పెను సంచలనంగా మారడం తెలిసిందే.
ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని
అయితే ఎస్పీబీ కూడా ఇకపై ఇళయరాజా పాటలను తాను పాడనని వెల్లడించారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక చానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ తనకు ఇళయరాజాకు మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని పేర్కొన్నారు. అయితే ఆయన చర్యలు తనను చాలానే బాధించాయన్నారు.
నాకూ ఆత్మాభిమానం ఉంది
అయినా తన సంగీత కచేరిలకు ఎలాంటి బాధింపు కలగలేదని పేర్కొన్నారు.,అదే విధంగా రారా.. పోరా.. అని మాట్లాడుకునేంత స్నేహమే తమదని, అలాంటిది ప్రస్తుత సమస్యను కాలమే తీర్చాలని పేర్కొన్నారు. ఈ విషయమై ఇళయరాజాతో ఫోన్లో మాట్లాడమని కొందరు హితవు పలికారన్నారు. అయితే తనకూ కొంచెం ఆత్మాభిమానం ఉందని బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు.