Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ కు మంట గలిపింది...మరి ఎన్టీఆర్ కి
హైదరాబాద్: రీసెంట్ గా ఎనకౌంటర్ స్పెషలిస్టు గా మహేష్ బాబు కనిపించిన సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఆగడు చిత్రంలో మహేష్ ఎనకౌంటర్ శంకర్ గా కనిపించి అదరకొట్టారు. అయితే సినిమా ఫెయిల్యూర్ టాక్ మూట కట్టుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్ సైతం ఎనకౌంటర్ స్పెషలిస్టు గా కనిపించటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ చిత్రంలో ఎనకౌంటర్ స్పెషలిస్టే అయినా ...కథ, డైలాగులు హైలెట్ గా నిలుస్తాయని కాబట్టి ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తాడని అంటున్నారు.
ఎన్టీఆర్, కాజల్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో ఎన్టీఆర్, ప్రకాష్రాజ్, సుబ్బరాజుపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా కనిపిస్తారని తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా దర్శక,నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
నిర్మాత మాట్లాడుతూ... ''పూరి జగన్నాథ్ మార్క్ సినిమా ఇది. ఎన్టీఆర్ శైలికి తగ్గట్టుగా మాస్ అంశాలకు ప్రాథాన్యముంది. ఆయన తొలిసారి పూర్తిస్థాయి పోలీసు పాత్రని పోషిస్తున్నారు. వినోదం, యాక్షన్ అంశాలు అలరిస్తాయి. ఇంటిల్లిపాదికీ నచ్చే మంచి సినిమా అవుతుంద'' అని అన్నారు.
ఈ చిత్రంలో మధురిమ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ:వక్కంతం వంశీ, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, కళ: బ్రహ్మ కడలి, ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు.