Don't Miss!
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎన్టీఆర్-పూరి కాంబినేషన్లో మూడో సినిమా వస్తోందా?
ఇజం సినిమా రిలీజైంది. సినిమాకు సూపర్ హిట్ టాక్ రాక పోయినా...ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్లాపుల్లో ఉన్న పూరికి ఇజం మంచి ఫలితాన్నే ఇచ్చిందని చెప్పొచ్చు. సినిమా సినిమాకు ఎక్కువగా గ్యాప్ తీసుకోని పూరి... నెక్ట్స్ మూవీపై దృష్టి పెట్టారు. కథను సిద్ధం చేసేందుకు తనకు సెంటిమెంటుగా ఉన్న బ్యాంకాక్ కు వెళ్లారు. పూరి బ్యాకాంక్ వెళ్లగానే ఆయన నెక్ట్స్ మూవీ ఎవరితో చేయబోతున్నారనే ఆసక్తి మొదలైంది. ఎన్టీఆర్ తోనా? లేక మహేష్ తోనా? అనే ఉత్కంఠ నెలకొంది. పూరికి అందుబాటులో ఉన్న హీరోల లిస్టును బట్టి చూస్తే నెక్ట్ష్ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టెంపర్ తర్వాత ఇద్దరూ కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. పూరి తారక్ కు ఆల్రెడీ స్టోరీ లైన్ కూడా వినిపించాడట. కాన్సెప్టు తారక్ కు నచ్చడంతో పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యాడని సమాచారం. అయితే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.