Don't Miss!
- News ఎన్నికల ముందు గుడ్ న్యూస్..ఫుల్ జోష్లో వైసీపీ
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రౌడీ ఫెలో....సీనియర్ ఎన్టీఆర్ను వాడేసుకుంటున్నాడు!
హైదరాబాద్: పాత సినిమాల్లోని హిట్ సాంగులను ఈ తరం హారోలు రీమిక్సుల పేరుతో వాడేసుకోవడం.....సినిమాకు పబ్లిసిటీ పెంచేసుకోవడం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. తాజాగా సీనియర్ ఎన్టీఆర్ హిట్ సాంగ్ ఒకటి ఇపుడు రీమేక్ చేస్తున్నారు. 'ఎంతవారులైన గానీ వేదాంతులైన గానీ' అనే సాంగును నారా రోహిత్ నటిస్తున్న 'రౌడీ ఫెలో' సినిమాలో రీమిక్స్ చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు కృష్ణ చైతన్య తెలిపారు.
ఈ సాంగును ఎన్టీఆర్ నటించిన 'భలే తమ్ముడు' చిత్రంలోనిది. ఈ పాటను సినారె రచించగా, మహ్మద్ రఫీ పాడారు. అప్పట్లో ఈ పాట సూపర్ హిట్. ఈ పాటను 'రౌడీ ఫెలో' చిత్రంలో సందర్భానికి తగిన విధంగా ఒరిజినల్ పాటను పాడు చేయకుండా రీమిక్స్ చేసినట్లు తెలిపారు.
నిర్మాత సినిమా విశేషాలు తెలియజేస్తూ 'యాక్షన్, కామెడీ, రొమాన్స్ అంశాలు మిళితమైన సినిమా ఇది. దర్శకుడు కృష్ణచైతన్య విభిన్నంగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. 'స్వామి రారా', 'ఉయ్యాల జంపాలా' చిత్రాలకు పనిచేసిన సన్నీ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. 'ఆషికి-2' చిత్రంలో తన గానంతో దేశాన్ని ఉర్రూతలూగించిన గాయకుడు ఆర్జిత్ సింగ్ ఇందులోని అన్ని పాటలూ పాడటం విశేషం' అని తెలిపారు.
'రౌడీ ఫెలో' చిత్రాన్ని మూవీ మిల్స్, సినిమా 5 సంస్థలు నిర్మిస్తున్నారు. విశాఖ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు, గొల్లపూడి, పోసాని, తాళ్లూరి రామేశ్వరి, సుప్రీత్, అజయ్, ఆహుతి ప్రసాద్, ప్రవీణ్, సత్య ఇతర ముఖ్యతారాగణం.