Don't Miss!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- News 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి!: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అఫీషియల్ :ఎన్టీఆర్, సుకుమార్ చిత్రం టైటిల్ ఖరారు
హైదరాబాద్: సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ లండన్లో జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి టైటిల్ ని అఫీషియల్ గా చిత్ర నిర్మాణ సంస్ద తన ఫేస్ బుక్ ఎక్కౌంట్ ద్వారా ఖరారు చేసింది. అదేమిటో ఇక్కడ చూడండి.
Happy to announce that the first look of our #NTR25 project shall be out on 17th. Co produced by Reliance Entertainments. #NannakuPrematho
Posted by Sri Venkateswara Cine Chitra on15 September 2015
పై మ్యాటర్ ప్రకారం ఈ సినిమాకి 'నాన్నకు ప్రేమతో...' అనే టైటిల్ నే ఖరారు చేసారు. మొదటి నుంచీ ఈ టైటిల్ ప్రచారంలో ఉన్నా టైటిల్ మారే అవకాసం ఉందని చాలా మంది భావించారు. అయితే ఇప్పుడు ఇచ్చిన ఈ అఫీషియల్ ఎనౌన్సమెంట్ తో టైటిల్ విషయం తెలిసిపోయింది.
చిత్రం విశేషాలకు వస్తే....
ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ప్రీత్ సింగ్ హీరోయిన్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 8,2016న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోగా దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 22న టీజర్ ని విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే టైటిల్ లోగోను సెప్టెంబర్ 17న విడుదల చేయనున్నారు.
అలాగే ఈ సినిమా కోసం లండన్లోని ఓ అపార్ట్మెంట్లో ని 26 వ ఫ్లోర్ లో ఆఫీస్ సెట్ వేసారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న జగపతి బాబు ఆఫీసు గా ఇది కనిపించనుంది. ఇందుకోసం 60 లక్షలకు పైనే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ కు ముందు జగపతిబాబుకు, ఎన్టీఆర్ కు మధ్య వచ్చే కీలక సన్నివేశం కోసం ఈ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ సెట్కు రూపకల్పన చేశారని సమాచారం. అక్కడ లండన్ వర్కర్స్ కొందరు ఈ సెట్ నిర్మాణంలో పాలుపంచుకున్నట్లు చెప్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''ఎన్టీఆర్ని కొత్త తరహా పాత్రలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన తెరపై కనిపించే విధానం భిన్నంగా ఉంటుంది. ఇదివరకటితో పోలిస్తే మరింత స్త్టెలిష్గా కనిపిస్తారు. ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా ఓ బైక్ని తయారు చేయించాం. అది చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ''ఎన్టీఆర్ సినీ ప్రయాణానికీ, మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. ఆ తర్వాత స్పెయిన్లో జరిగే షెడ్యూల్తో సినిమా పూర్తవుతుంది'' అన్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని తమిళంలో డబ్బింగ్ చేసి అదే రోజు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా కొందరు తమిళ నటుల్ని కీలకమైన పాత్రలకు తీసుకుందామనే ఆలోచనలో దర్శక,నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.