twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ధాంక్యూ తారక్, ఇదే ట్రెండింగ్ నేషన్ వైడ్, ఎన్టీఆర్ కు ఎంత ఓపిక

    By Srikanya
    |

    హైదరాబాద్ : జనతాగ్యారేజ్ షూటింగ్ కోసం చెన్నై లో ఉన్న యంగ్ టైగర్ ని చూడటానికి...ఒక్క నిమిషమైనా మాట్లాడటానికి ఆయన అభిమానులు బారులు తీరిన సంగతి తెలిసిందే. ఆయన షూటింగ్ జరుగుతున్న ప్రతీచోట చాంతాడంత క్యూలు కట్టి బారులు తీరారు. అయితే ఓపిగ్గా వారందరితో ఫొటోలు దిగారు ఎన్టీఆర్, వారంతా ఇప్పుడు ధాంక్యూ తారక్ అనే హ్యాష్ టాగ్ తో తాము తమ అభిమాన హీరోతో దిగిన ఫొటోలను షేర్ చేస్తున్నారు.

    ధాంక్యూ తారక్ అనేది గురువారం నుంచి ట్రెండింగ్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో మొదలైంది. దాదాపు పది వేల ఫొటోల వరకూ అభిమానులు షేర్ చేసారు. జనతా గ్యారేజ్ తొలిరోజు షూటింగ్ లో దిగిన ఫొటోల నుంచి నిన్న మొన్నటి సాంగ్ షూటింగ్ దగ్గర దిగిన ఫొటోలు దాకా షేర్ చేస్తూనే ఉన్నారు.

    అసలు అంతమందితో అన్ని ఫొటోలు..అదీ ఎక్కడా చిరు నవ్వు చెక్కు చెదరకుండా అనేది చాలా గొప్ప విషయం అంటున్నారు సీనియర్స్. ఎన్టీఆర్ ఎలా మ్యానేజే చేసారు ఈ అభిమానులను. చాలా సమయం కూడా వెచ్చించాల్సి వస్తుంది అంటే ఒకటే సమాధానం వస్తోంది అది ఎన్టీఅర్ కు అభిమానులు అంటే ప్రాణం. అదే ఆయన లో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఏ మాత్రం షూటింగ్ గ్యాప్ దొరికినా తమ అభిమానులతో గడిపేలా చేసింది అంటున్నారు.

    జనతా గ్యారేజ్ చిత్రం విశేషాలకు వస్తే... హీరో మెకానిక్ అని లేదా ఇంజినీర్ అని ప్రచారం జరుగుతోంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆయన మెకానిక్ మాత్రం కాదు. ఆయనకు ఈ చిత్రంలో ఓ హాబి ఉంటుంది. సినిమా మొత్తం ఆ హాబి ని బేస్ చేసుకుని క్యారక్టరైజేషన్, సీన్స్ ఉంటాయి.

    ఆ హాబి ఏమిటంటే..ఎన్టీఆర్ ప్రకృతి ప్రేమికుడు,చుట్టూ పచ్చగా ఉండాలి అని దానికోసం కష్టపడుతూంటాడు. అంతేకాకుండా పరిశుభ్రంగా ఉండాలని కూడా శ్రమిస్తూంటాడు. తన చుట్టు ప్రక్కల వారిని ఆ మేరకు మోటివేట్ చేస్తూంటాడు. ఇదే పాయింట్ మీద ఇంట్రడక్షన్ సీన్ సైతం ఉండబోతోంది.

    స్లైడ్ షోలో ఫ్యాన్స్ తో దిగిన కొన్ని ఫొటోలు, సినిమా విశేషాలు చూడండి

    ఆడియో డేట్, వెన్యూ

    ఆడియో డేట్, వెన్యూ

    ఈ చిత్రం ఆడియోని జూలై 22 న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ఆడియో రిలీజ్ కు వేదక కోసం రకరకాలు అనుకున్నా చివరకు అటు తిరిగి ఇటు తిరిగి హైదరాబాద్ లోనే బెస్ట్ అనే నిర్ణయానికి టీమ్ వచ్చి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    రెమ్యునేషన్

    రెమ్యునేషన్

    ‘జనతాగ్యారేజ్' కోసం రూ. 18 కోట్లు అందుకోబోతున్నారట. టాలీవుడ్‌లో ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల లిస్ట్ లో ఎన్టీఆర్ కూడా ఈ చిత్రం తో చేరారు.

    దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ....

    దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ....

    ఎన్టీఆర్‌లో వున్న నటుడికి, ఆయన మాస్ ఇమేజ్‌కు సరిపోయే కథ ఇది. ఇదొక ఎమోషనల్ ఎంటర్‌టైనర్. ఎన్టీఆర్‌ను చాలా కాలంగా ఎలా చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారో ఆ స్థాయిలో ఆయన పాత్రను తీర్చిదిద్దాను.

    ఎక్సపెక్టేషన్స్

    ఎక్సపెక్టేషన్స్

    ఈ చిత్రంపై అభిమానులలో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

    ఇద్దరు హీరోయిన్స్

    ఇద్దరు హీరోయిన్స్

    మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సమంత, నిత్యా మేనన్‌లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

    కీలకపాత్ర

    కీలకపాత్ర

    మలయాళ నటుడు మోహన్‌లాల్‌ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

    హిట్ తర్వాత

    హిట్ తర్వాత

    నాన్నకు ప్రేమతో' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్‌' చిత్రం చేస్తున్నారు ఎన్టీఆర్‌.

    లింకేంటో

    లింకేంటో

    'ఇక్కడ అన్నీ రిపేర్లు చేయబడును' అని ట్యాగ్ లైన్ కి, ఎన్టీఆర్ కు లింక్ ఏంటో చూడాలి.

    పబ్లసిటీ ఓ రేంజిలో

    పబ్లసిటీ ఓ రేంజిలో

    నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్ నిర్మాతలు. ఈ సినిమా పబ్లిసిటీని ఓ రేంజిలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది

    ప్రచారం

    ప్రచారం

    ఈ సినిమాలో ఎన్టీఆర్‌ని ఓ మెకానిక్‌గా చూపించబోతున్నారని ప్రచారం సాగుతోంది. నిజం ఎంతో

    హైప్

    హైప్

    శ్రీమంతుడు లాంటి భారీ హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన కొరటాల, జనతా గ్యారేజ్ ని డీల్‌ చేస్తుండడంతో మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ అయింది.

    అక్కడ కూడా

    అక్కడ కూడా

    ఇంక ఈ చిత్రంలో మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ నటిస్తుండడంతో తెలుగులోనే కాక, మలయాళంలోను ఈ మూవీపై ఉన్న అంచనాలు భారీగా పెరిగాయి

    మరొకరు

    మరొకరు

    జనతా గ్యారేజ్‌ చిత్రంలో మోహన్‌లాల్‌తో పాటు మరో మలయాళ యాక్టర్‌ ఉన్ని ముకుందన్ విలన్‌గా నటిస్తున్నారు.

    ఈయనకూడా

    ఈయనకూడా

    గతంలో ఎవడు అనే చిత్రంలో చిన్న స్థాయి విలన్ పాత్ర పోషించిన 'జాన్‌ కొక్కెన్‌' జనతా గ్యారేజ్‌ చిత్రంలో కీలక పాత్రను పోషించనున్నట్టు తెలుస్తుంది.

    నెక్ట్స్ షెడ్యూల్

    నెక్ట్స్ షెడ్యూల్

    ఈ వారంలో నెక్ట్స్ షెడ్యూల్ ని చెన్నైలో జరపటానికి సన్నాహాలు పూర్తి చేసారు.

    నెలాఖరు దాకా

    నెలాఖరు దాకా

    నెలాఖరుదాకా చెన్నైలో ఎన్టీఆర్ పై కీలకమైన సన్నివేశాలు తీస్తారు.

    ఫ్లాష్ బ్యాక్ సిన్స్

    ఫ్లాష్ బ్యాక్ సిన్స్

    అందుతున్న సమాచారం అక్కడ ఐఐటి స్డూటెండ్ గా ఎన్టీఆర్ గా కనిపించే సన్నివేశాలు పూర్తి చేస్తారు.

    ఐటం..

    ఐటం..

    ఈ చిత్రంలో ఓ ఐటం సాంగ్ ని ప్లాన్ చేస్తున్నట్లు సమచారం. అయితే ఐటం సాంగ్ ఎవరు చేస్తారు అనే విషయం దగ్గర ఆగిపోయిందని సమాచారం.

    వీళ్లంతా ఆప్షన్షే

    వీళ్లంతా ఆప్షన్షే

    దర్శకుడు కొరటాల శివ హంసానందిని చేత చేయించాలని ప్రపోజల్ పెట్టినా ఎన్టీఆర్ వద్దని, తమన్నా కానీ అంజలి కానీ అయితే బెస్ట్ అని సూచించినట్లు తెలుస్తోంది. తమన్నా కు మొదట ప్రయారిటి అని, ఆమె కాదంటే అంజలి వద్దకు వెళ్తారని చెప్తున్నారు. మరి ఎవరు ఫైనలైజ్ అవుతారో చూడాలి.

    అద్బుతమైన స్పందన

    అద్బుతమైన స్పందన

    యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా మొన్న విడుదలైన 'జనతా గ్యారేజ్' ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

    అదిరిపోయాయి

    అదిరిపోయాయి

    ఈ పోస్టర్స్ లో యన్టీఆర్ ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో కనిపించడంతో ఆయన అభిమానులలో మంచి స్పందన కనిపించింది.

    మాస్ లుక్

    మాస్ లుక్

    నాన్నకు ప్రేమతో చిత్రంలో క్లాస్ లుక్‌తో మెప్పించిన ఎన్టీఆర్ ఈ తాజా చిత్రంలో మాస్ లుక్‌లో కనిపించబోతున్నాడు.

    ఇంటర్వెల్

    ఇంటర్వెల్

    దర్శకుడు కొరటాల శివ..గత రెండు చిత్రాల ఇంటర్వెల్ లాగ కాకుండా ఇది పరవ్ ఫుల్ పంచ్ తో ఉంటుందని, ఇంటర్వెల్ వద్ద ఓ భారీ ఫైట్ తో పాటు, కథలో ఓ షాకయ్యే విషయం రివీల్ అవుతుందని చెప్పుకుంటున్నారు.

    బెస్ట్ ఇంటర్వెల్

    బెస్ట్ ఇంటర్వెల్

    ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ ఇంటర్వెల్ అవ్వాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు.

    అంతకుమించి

    అంతకుమించి

    ఇంతకాలం ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ ఇంటర్వెల్ లో ఆయన కు నచ్చింది సింహాద్రి ఇంటర్వెల్ అని చెప్తారు. ఇప్పుడు అలాంటిది కాకపోయినా అంతకు మించి పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు.

    నిర్మాతలు

    నిర్మాతలు

    నిర్మాతలుమాట్లాడుతూ ...హైదరాబాద్, చెన్నై, ముంబై, కేరళలో షూటింగ్ చేస్తాం. చిత్రాన్ని ఆగస్టు12న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

    పుష్కకాలు కానుక

    పుష్కకాలు కానుక

    కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆగస్టు 12న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు సినిమా ప్రారంభోత్సవం రోజు నిర్మాతలు ప్రకటించారు.

    తెరముందు

    తెరముందు

    ఎన్టీఆర్ తో పాటు నిత్యామీనన్, సమంత, మోహన్ లాల్, సాయికుమార్, ఉన్ని ముకుందన్, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ, గుణాజీ, సితార, దేవయాని నటిస్తున్నారు.

    తెరవెనుక

    తెరవెనుక

    ఈ చిత్రానికి కెమెరా: మది, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్రకాశ్, కథ, మాటలు, దర్శకత్వం: కొరటాల శివ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: చంద్రశేఖర్‌ రావిపాటి.

    తమిళ మార్కెట్ టార్గెట్

    తమిళ మార్కెట్ టార్గెట్

    తెలుగులో ఎలాగూ ఎన్టీఆర్ సినిమా అంటే ఉన్న క్రేజ్ చెప్పక్కర్లేదు. ఇక తమిళ మార్కెట్ ని టార్గెట్ చేయాలంటే ...అందులో మొదటి అస్త్రం సమంత, రెండోది తమిళంలో షూటింగ్ జరపటం, అలాగే కొంతమంది ఆర్టిస్ట్లులను తమిళం నుంచి తీసుకోవటం.

    మూడు భాషల్లో...

    మూడు భాషల్లో...

    ఇప్పుడు జనతాగ్యారేజ్ టీమ్ అదే చేయబోతోందని చెప్తున్నారు. అంటే మూడు భాషల్లోనూ జనతా గ్యారేజ్ దుమ్ముదులపటం ఖాయం అన్నమాట.

    దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ....

    దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ....

    ఎన్టీఆర్‌లో వున్న నటుడికి, ఆయన మాస్ ఇమేజ్‌కు సరిపోయే కథ ఇది. ఇదొక ఎమోషనల్ ఎంటర్‌టైనర్. ఎన్టీఆర్‌ను చాలా కాలంగా ఎలా చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారో ఆ స్థాయిలో ఆయన పాత్రను తీర్చిదిద్దాను.

    English summary
    Many pictures of NTR with fans have been going viral in social media. To thank their actor, NTR fans have started to trend the hash tag ‘ThankYouTarak’ in Twitter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X