Don't Miss!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ఎన్టీఆర్ ..... క్రిష్ కి ఎందుకు ఫోన్ చెసాడంటే!?
హైదరాబాద్ : తనను ఇంప్రెస్ చేసిన వాళ్లని మెచ్చుకొవడం ఎన్.టి.ఆర్.కి అలవాటే. అదే పద్దతిలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న కంచె సినిమా టీజర్ ని చూసి , ఆ చిత్ర దర్శకుడు క్రిష్ కు ఫోన్ చేసి అభినందిచాడు. ఈ విషయాన్ని క్రిష్ స్వయంగా మీడియాకు తెలియచేసారు. కంచె చిత్రం ప్రీ రిలిజ్ ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో ఈ విషయం చెప్పారు.
క్రిష్ మాట్లాడుతూ... "కంచె ట్రైలర్ విడుదలైన తర్వాత, మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియచేసారు, ఆయన అంతకు ముందు బాలీవుడ్ లో నేను గబ్బర్ చిత్రం చేసినప్పుడు కూడా అదే విధంగా విషెష్ చెప్పారు. ఈ మధ్యనే ఎన్టీఆర్ లండన్ నుంచి ఫోన్ చేసి ఈ ప్రోమో గురించి అభినందిస్తూ మాట్లాడారు. అలాగే రామ్ చరణ్, బన్నిు కూడా కంచె ప్రోమో గురించి నాకు అభినందనలు తెలియచేసారు ." అని చెప్పుకొచ్చారు.
కంచె విషయానికి వస్తే...
కంచె చిత్రం ఈ నెల 22న విడుదల అవుతోంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్తేజ్ ఓ సైనికుడి పాత్రలో కన్పించనున్నారు. అప్పటి పరిస్థితులను, యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించిందేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని ఓ సందర్భంలో క్రిష్ చెప్పారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబా, రాజీవ్రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు చింతాన్భట్ సంగీతం అందిస్తున్నారు. ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్.
ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యి..విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు. ఇందులో భాగంగా చిత్రం మేకింగ్ వీడియోని విడుదల చేసారు. ఇక్కడ ఆ వీడియోని చూడండి.
మరో ప్రక్క ఈ చిత్రం బిజినెస్ ఊపందుకుంది. ఓవర్ సీస్ లో సైతం ఈ చిత్రం మంచి రేటుకు అమ్ముడుపోయింది. ఓవర్ సీస్ లో కొత్తగా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోకి ప్రవేశించిన "Absolute Telugu Cinemas" వారు ఈ చిత్రం రైట్స్ ని కోటి పాతిక లక్షలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ కంపెనీని కొంతమంది ఎగ్జిబిటర్స్ కలిసి ఏర్పాటు చేసుకున్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ... ఈ సినిమా కోసం జార్జియా గవర్నమెంట్ అనుమతి తీసుకుని ఆ బ్యాక్ డ్రాపుకు తగిన విధంగా గన్స్, ట్యాంకర్స్, టీకప్స్ ఇలా అన్నీ ఉపయోగించాం. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్, సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వండర్ ఫుల్ ఎఫర్టె పెట్టి పని చేసారు. రెండో ప్రపంచ యుద్ధం మీద తీసిన ఈ సినిమాకు చింతన్ భట్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. మనకు చాలా మంది దర్శకులు ఉన్నా ఎందుకో రెండో ప్రపంచ యుద్ధం గురించి కథను తీయలేదు. నేను ఎవరికీ భిన్నంగా ఉండాలని ఈ కథను చెప్పలేదు. చెప్పని కథలను చెప్పడానికి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్' అన్నారు.
ఆ మధ్యన పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా ఈ చిత్రం థియేటర్ ట్రైలర్ విడుదల చేసారు. ఆ ట్రైలర్ ఇదిగో...
వరుణ్ తేజ్ మాట్లాడుతూ.... ఈ సినిమాలో నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. నా టీమ్ అందరికీ దన్యవాదాలు. పండగరోజు అందరూ ఫ్యామిలీతో ఉండాలనుకుంటారు. అభిమానులందరూ నా ప్యామిలీ. పెదనాన్న చిరంజీవి గారికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనకు థాంక్స్ తప్ప ఏమీ చెప్పుకోలేను. మంచి సినిమా చేస్తున్నాను. నాన్న పరువు నిలబడెతాను. సినిమా విడుదలైన తర్వాత బాబాయ్ పవన్ కళ్యాణ్ కి చూపిస్తాను. సినిమా ఎలా ఉందని అడుగుతాను. అభిమానులు గర్వ పడేలా సినిమా ఉంటుంది. అన్నారు.
సిరివెన్నెల మాట్లాడుతూ... రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెలుగులో సినిమా రావడం ఇదే తొలిసారి. ఈ సినిమా మనల్ని 1945లోకి తీసుకెళ్తాయి. యుద్దంలో ప్రేమ ఉంటుంది. ప్రేమ కూడా యుద్ధంలాగే ఉంటుంది అని చెబుతూ ప్రపంచంలోని మనిషి దేని కొట్టుకుంటున్నాడో తెలియని దాన్ని యుద్ధం రూపంలో చెప్పడం, అందులోనే ప్రేమను కూడా చెప్పడం, ఈ మనిషి తాలూకు వైరుధ్యాన్ని చూపడం నాకు చాలా బాగా నచ్చింది అన్నారు. వరుణ్ ని చూస్తుంటే హాలీవుడ్ నటున్నిచూసినట్లు ఉంది. రెండో సినిమాకే ఇలాంటి సినిమాలో అవకాశం దొరకడం అదృష్టం అన్నారు.
రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అద్భుత ప్రేమ కథను మిళితం చేశామని దర్శకుడు క్రిష్ చెప్పారు. చిత్రంలో కనిపించే 1940ల నాటి దృశ్యాలు, యుద్ధ సన్నివేశాల కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజీవ్రెడ్డి, సాయిబాబా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.