Don't Miss!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అఫీషియల్ : అక్టోబర్ 2న...ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్
హైదరాబాద్ : అక్టోబర్ 2 న గాంధీ జయింతి సందర్బంగా ఎన్టీఆర్ చేతుల మీదుగా...కుమారి 21 ఎఫ్ ఆడియోని విడుదల చేయటానికి నిర్ణయం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటన చేసారు. సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ఎన్టీఆర్..అదే సుకుమార్ ప్రొడక్షన్ లో రెడీ అవుతున్న చిత్రం కావటంతో ఈ ట్రైలర్ లాంచ్ కు ఛీఫ్ గెస్ట్ గా కమిటయ్యినట్లు సమాచారం.
సుకుమార్కు తొలిసారి నిర్మాతగా మారి ఓ విలక్షణ కథతో కుమారి 21 ఎఫ్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత కాకుండా ఆయన కథ, స్క్రీన్ప్లే, మాటలు అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ సమర్పణలో విజయ్కుమార్ బండ్రెడ్డి, థామస్రెడ్డి ఆదూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకుడు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం, రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తుండటం విశేషం. చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ ఇదొక విభిన్నమైన ప్రేమకథ. దేవీశ్రీప్రసాద్ సంగీతం, రత్నవేలు ఫొటోగ్రఫీ చిత్రానికి హైలైట్గా నిలుస్తాయి. రాజ్తరుణ్ పాత్ర, అభినయం అందర్ని ఆకట్టుకుంటుంది అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ సుకుమార్ భాగస్వామ్యంలో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న చిత్రమిది. సుకుమార్ మార్క్లో సాగే ఈ ప్రేమకథాచిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్లుక్కు విశేష స్పందన లభిస్తోంది. త్వరలో టీజర్ను, అక్టోబర్ 30న చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. నోయల్, నవీన్, సుదర్శన్రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగి బ్రదర్స్, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి కెమెరా:ఆర్.రత్నవేలు,ప్రొడక్షన్ డిజైనర్:ఎస్.రవీందర్,ఎడిటింగ్:కార్తిక శ్రీనివాస్, పాటలు:చంద్రబోస్, మాటలు:పొట్లూరి వెంకటేశ్వరరావు, ఫైట్స్:డ్రాగన్ ప్రకాష్, డ్యాన్స్:ప్రేమ్క్ష్రిత్, సహనిర్మాతలు:ఎం.రాజా, ఎస్.రవికుమార్.