Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఈ రోజు విడుదలవ్వాలి కానీ పది రోజుల ముందే యూట్యూబ్ లో... ఎవరు చేసారా పని ??
నటి రమ్యశ్రీ వ్యాంప్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ కొంత కాలం విరామం తీసుకుని మెగాఫోన్ పట్టింది. శ్రీకాకుళం వాసి అయిన ఈమె అక్కడ జరిగిన ఓ సంఘటన ఆధారంగా సినిమా తీశానని స్టేట్మెట్ ఇచ్చింది. దాదాపు రెండేళ్ళ నుంచి తీస్తున్న ఈ సినిమా విడుదల కోసం అనేక అడ్డంకులు ఎదుర్కొంది. ఆ చిత్రమే 'ఓ మల్లి'.
బి.రమ్యశ్రీ ప్రధాన పాత్రధారిణిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'ఓ మల్లి'. ఈ చిత్రం ఈనెల 13న నైజాంలో విడుదలవుతుంది. ఇటీవల నైజాం మినహా మిగతా ప్రాంతాల్లో విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్ నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా మంచి స్పందనను రాబట్టుకుంది.
Photo Gallery: ఓ మల్లి
గిరిజన ప్రాంతం అరకులో మల్లి తన తండ్రి నారిగాడు తోపాటు జీవిస్తూ ఉంటుంది. కూతురంటే వల్లమాలిన ప్రేమ. అంతకంటే సారాకూ బానిస. ఊరిలోనే సింగడు కన్ను మల్లిపై పడుతుంది. నారిగాడిని మంచి చేసుకుని మల్లిని దక్కించుకోవాలని చూసే క్రమంలో అవమానానికి గురవుతాడు.
దాంతో కసి పెంచుకుని ఊరి జాతర రోజు రాత్రి మల్లిని అత్యాచారం చేస్తాడు. స్థానికులకు ఇది తెలిసి సింగడుకు గుండుగీసి ఊరేగిస్తారు. ఆ తర్వాత నారిగాడు చనిపోవడంతో ఒంటరిదైన మల్లిని పక్క ఊరి రాములయ్య (రఘుబాబు) పెళ్లి చేసుకుంటాడు. కొద్దికాలానికే రాములయ్య కల్తీసారా తాగి పక్షవాతానికి గురవుతాడు.
అప్పటి నుంచి తనే సేవలు చేస్తూ, గంపలో పిల్లల ఆటవస్తులు అమ్మి జీవనం సాగిస్తుంది. ఇలాంటి సమయంలో విశాఖ రైల్వేస్టేషన్లో టికెట్ కలెక్టర్ రవి ఈమెను చూసి ఇష్టపడతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది? అనేది కథ.
అయితే ఇప్పటికే యూ ట్యూబ్ లో పూర్థి సినిమాని పెట్టేసారు. అయినా థియేటర్లలో రిలీజ్ చేస్తునారు మరి ముందే యూట్యూబ్ లో చూసేసిన వాళ్ళు మళ్ళీ థియేటర్ లో డబ్బులు పెట్టి ఎలా చూస్తారు? మంచి పేరు తెచ్చుకున్న సినిమనే అయినా కలెక్షన్లలో డీలా పడిపోతుంది కదా...
మరి నటి రమ్య శ్రీ ఎందుకిలాంటి నిర్ణయం తెవెసుకుందో అర్థం కావటం లేదు... మొత్తానికి ఒక మంచి సినిమా అనిపించుకున్న ఒక మల్లి కనీస వసూళ్ళని రాబట్టటం లో సఫలం ఔతుందా అనేది ఇప్పుడు ప్రశ్న.. అయితే ఒక అవార్డ్ ఫిలిం కి ఉండాల్సిన అన్ని లక్షణాలూ ఉన్న "ఓ మల్లి" ని పెద్ద తెర మీద కూడా చూడాలనుకునే వారికోసం ఒక అవకాశం అనుకోవచ్చేమో...