Don't Miss!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
క్షమించండి, నీచంగా మాట్లాడాను: నటుడు ఓంపురి కన్నీరు
హైదరాబాద్: బాలీవుడ్ సీనియర్ నటుడు ఓంపురి తన వివాదాస్పద కామెంట్లతో ఇటీవల విమర్శల పాలైన సంగతి తెలిసిందే. దేశ రక్షణలో నిత్యం తమ ప్రాణాలను పణంగా పెట్టే సైనికుల ఉద్దేశించి అతడు చేసిన కామెంట్స్ దేశ పౌరులందరికీ ఆగ్రహం తెప్పించింది.
యూరి ఘటన తర్వాత ఓంపురి ఓ ఇంటర్వ్యూలో సైనికుల గురించి మాట్లాడుతూ వారిని ఆర్మీలో ఎవరు చేరమన్నారు, ఎవరు ఆయుధాలు పట్టుకోమన్నారు.. అంటూ చేసిన దిగజారుడు వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
తన వ్యాఖ్యలు ఎంత నీచమైనవో....తన ప్రవర్త ఎంత పెద్ద తప్పో తెలుసుకున్న ఆయన వెంటనే తన కామెంట్స్ ను వెనక్కి తీసుకోవడంతో క్షమాపణలు చెప్పారు. తాజాగా ఆయన తన 66వ పుట్టినరోజు సందర్భంగా బారాముల్లా కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ జవాను నితిన్ యాదవ్ ఇంటికి వెళ్లి భావోద్వేగాని గురై కంటతడి పెట్లారు.
ప్రస్తుతం నితిన్ యాదవ్ కుటుంబం కాన్పూర్ ఉండటంతో అక్కడికి వెళ్లిన ఓంపురి జవాన్ కుటుంబీకులను పరామర్శించారు. ప్రార్థన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఓంపురి కన్నీరుమున్నీరవుతూ తాను సైనికులను ఉద్దేశించి చాలా తప్పుగా మాట్లాడానని, తనను క్షమించాలిన మరోసారి వేడుకున్నారు.