Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నమ్ముతారా? వార్తలు చదువుతోంది ఓ హిజ్రా
చెన్నై: టీవీ చరిత్రలోనే మొదటిసారిగా వార్తలు చదివే హిజ్రా... పద్మినీప్రకాశ్. సాధారణంగా హిజ్రాలు మాట్లాడితేనే చుట్టుపక్కలున్నవారు గేలి చేసి నవ్వుతారు. దీన్ని లెక్క చేయకుండా టీవీ ఛానెల్లో వార్తలు చదివే పనిలో నిమగ్నమైంది పద్మిని. లోటస్ ఛానల్లో ఉదయం ఏడు గంటల నుంచి 7.30 గంటల వరకు పద్మిని ప్రకాశ్ లైవ్ వార్తలు వినడానికి అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు.
ఇదే నాకు దక్కిన గుర్తింపు అంటూ చిరునవ్వుతో చెబుతుందామె. ఆమె న్యూస్రీడర్గా మారి రెండు నెలలు కావస్తోంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో పనిచేస్తున్న లిప్ టీవీలో కొన్ని వారాల కిందట నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఈమెను గురించి చర్చ జరిగింది. సుమారు 250కి పైగా వెబ్సైట్లలో పద్మిని ప్రకాశ్ని ప్రశంసించి రాసి తమ అభినందనలు నమోదు చేశారు.
యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా పలు రకాలుగా ఈమెపై అభినందనల జల్లు కురుస్తూనే ఉంది. హిజ్రాలలో మొదట వార్తలు చదివేదానిగా ఉంటానని కలలో కూడా వూహించలేదని చెబుతోంది పద్మిని ప్రకాశ్. ఇద్దరు యువకులు కొన్ని నెలల కిందట తన ఇంటికి వచ్చి టీవీఛానెల్లో వార్తలు చదవడానికి తనను ఆహ్వానించినప్పుడు నమ్మశక్యం కాలేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తనను గేలి చేయడానికే అలా పిలుస్తున్నారని అనుకున్నది.
హిజ్రాలపై ఉన్న వివక్షను తొలగించేందుకు 'తాయ్' సంస్థలో చేరి అవగాహన ప్రచారంలో పాల్గొన్నట్టు చెబుతున్న పద్మినికి ప్రచార చిత్రాల్లో నటించడానికి ఆహ్వానం వచ్చింది. మదుపానక్కడై అనే సినిమాలో నటించింది. జీ తమిళ్ ఛానల్లో రుద్ర ధారావాహికలో ఏడాదిపాటు నటించింది. సాలమన్ పాపయ్య చర్చావేదికలో హిజ్రాల దయనీయస్థితిని గురించి మాట్లాడి పలువురిని ఆకర్షించింది.