Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అక్షయ్ కుమార్ చిత్రాన్ని నిషేదించిన పాకిస్థాన్
ముంబై: అక్షయ్ కుమార్ హీరోగా నీరజ్ పాండే దర్శకత్వం వహించిన సినిమా 'బాబీ'. ఇదొక యాక్షన్ అండ్ స్పై థిల్లర్ మూవీ. టెర్రరిస్టులను పట్టుకునే ఇండియన్ గూడాచారికి సంబంధించిన సినిమా కథ కావడంతో ఈ సినిమాపై పాకిస్తాన్ నిషేదం విధించింది. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్, కరాచీలోని సెన్సార్ బోర్డులు ఈ సినిమా చూసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుందని పాకిస్థాన్ పత్రికి ‘ది డాన్' పేర్కొంది.
కేవలం సినిమాపై మాత్రమే కాదు....సిడీలు, డీవీడీలపై కూడా నిషేదం విధించారు. అయితే ఈచిత్రం పాకిస్థాన్కు ఏ మాత్రం వ్యతిరేకం కాదని దర్శకుడు నీరజ్ పాండే వెల్లడించారు. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన స్పై థ్రిల్లర్ ‘ఏక్ థా టైగర్' చిత్రాన్ని కూడా పాకిస్తాన్ నిషేదించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రత్యేక అధికారి పాత్రలో నటించారు. 'మొదట ఈ కథ వినప్పుడు చాలా ఆశ్చర్యానికి లోనయ్యా. తర్వాత బాబీ పేరు ప్రాధాన్యం అర్థమైంది. ఇందులో ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ ఉంటాయి. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ తయారు చేశారు. ఈ సినిమాలో ఇంటెలిజెన్స్ అధికారిగా నటిస్తున్నా' అని అక్షయ కుమార్ తెలిపారు. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన 'బాబీ'లో అనుమప్ ఖేర్, దగ్గుబాటి రానా, తాప్సీ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.