Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సుమంత్ మూవీలో హీరోయిన్గా టీవీ బ్యూటీ
హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున మేనల్లుడు సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయినా స్టార్ హీరో రేంజికి ఎదగలేక పోయాడు. అయితే తనకు సూటయ్య సినిమాలు ఎంచుకుంటూ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆయన సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ కాక పోవడంతో అవకాశాలు తగ్గాయి.
దీంతో ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్నాడు సుమంత్. ఎట్టకేలకు సుమంత్కు ఓ ప్రాజెక్టు ఓకే అయింది. బాలీవుడ్ హిట్ మూవీ ‘వికీ డోనర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హిందీ వెర్షన్లో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రను తెలుగులో సుమంత్తో చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకుడిగా పరిచయంకాబోతున్నారు. హిందీ టీవీ సీరియల్ నటి పల్లివి శుభాష్ అనే భామను హీరోయిన్ గా ఎంపిక చేసారు. పల్లవీ సుభాష్ మహాభారత్, చక్రవర్తి అశోక్ సమ్రాట్ వంటి సీరియల్స్ తో హిందీ టెలివిజన్ ప్రేక్షకులను మెప్పించింది ఈమె. ఇప్పుడు విక్కీ డోనర్ తెలుగు రీమేక్ తో టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తోంది.
తెలుగు నేటివిటీకి తగిన విధంగా స్క్రిప్టు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కాన్సెప్టు బాలీవుడ్లో సక్సెస్ అయింది కానీ... తెలుగులో ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది చర్చనీయాంశం అయింది.