Don't Miss!
- News మేషరాశిలో సూర్య సంచారం.. ఈ రాశులవారికి ఆకస్మిక ధననష్టం
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘పరంపర’కు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్
హైదరాబాద్: సీనియర్ నటులు నరేష్, ఆమని ముఖ్యపాత్రలో ధృతి మీడియా పతాకంపై మధు మహంకాళి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పరంపర'. ఒక కుటుంబం యొక్క కలలాంటి కథ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో స్వచ్చమైన మానవీయ బంధాలను అత్యద్భుతంగా తెరపై చూపించిన మధు మహంకాళికి ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్ లో సత్కారం లభించింది. ‘పరంపర' చిత్రానికి ప్లాటినమ్ అవార్డ్ బహూకరించబడింది.
ఈ అవార్డు లభించడం పట్ల చిత్ర దర్శక నిర్మాత మహంకాళి మధు సంతోషం వ్యక్తం చేసారు. అక్టోబర్లో ‘పరంపర' చిత్రాన్ని విడుదల చేయనున్నామని తెలిపారు. సీనియర్ నరేష్, ఆమని ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
చిత్ర విశేషాలను దర్శక నిర్మాత మధుమహంకాళి తెలియజేస్తూ- మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే పరిశ్రమలో మంచి టాక్ ఉంది. కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ఈ కథ అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మాస్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, క్లాసిక్ ఎంటర్టైనర్స్ను కూడా ఆదరిస్తారని ‘దృశ్యం' సినిమాతో రుజువుచేశారు. ఆ నమ్మకంతోనే ‘పరంపర' చిత్రాన్ని పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చిత్రీకరిస్తున్నామని తెలిపారు.