Don't Miss!
- News 527 భారత ఫుడ్ ఐటమ్స్ లో క్యాన్సర్ కారకాలు-జాబితాలో ఇవే- ఈయూ గుర్తింపు..!
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ప్రదీప్-పావని పెళ్లి వీడియో : ఆత్మహత్య ఘటనతో ఫ్యాన్స్ కన్నీరు...
ఆగస్టు 21, 2016లో ప్రదీప్, పావని రెడ్డి వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. పట్టుమని పది నెలలు కూడా గడవక ముందే ఇలాంటి విషాదం చోటు చేసుకోవడాన్ని బుల్లితెర ప్రేక్షకలు జీర్ణించుకోలేక పోతున్నారు.
హైదరాబాద్: టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య సంఘటన తెలిసి పలువురు బుల్లితెర అభిమానులు, సన్నిహితులు శోక సముద్రంలో మునిగిపోయారు. క్షణికావేశంలో ప్రదీప్ ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం అందరినీ బాధించింది.
ఆగస్టు 21, 2016లో ప్రదీప్, పావని రెడ్డి వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. పట్టుమని పది నెలలు కూడా గడవక ముందే ఇలాంటి విషాదం చోటు చేసుకోవడాన్ని బుల్లితెర ప్రేక్షకలు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఇంటర్నెట్ లో పెళ్లి వీడియో వైరల్
ప్రదీప్ ఆత్మహత్య సంఘటన తర్వాత.... ఆయన ఎవరు? ఆయన భార్య ఎవరు? అనే అంశాలపై నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఈక్రమంలో గతేడాది ఆగస్టులో జరిగిన వీరి పెళ్లికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.
క్షణికావేశమే...
ప్రేమికులైనా, భార్య భర్తలైనా తమ రిలేషన్ షిప్ లో చిన్న చిన్న మనస్పర్థలు మామూలు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ చిన్న చిన్న గొడవల వల్ల క్షణికావేశానికి గురై ఆతహత్యలకు పాల్పడటం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. ప్రదీప్ ఆత్మహత్య కూడా అలాంటి దే అంటున్నారు ప్రముఖ నటి కవిత.
విషాదంలో పావని
తాను ప్రేమించిన వాడు, భర్తగా ఏరి కోరి కట్టకున్నవాడు శవమై తేలడంతో పావని శోక సముద్రంలో మునిగి పోయింది. ప్రదీప్ ఇలా చేసుకుంటాడని అస్సలు ఊహించలేదని, షాకయ్యానని పావని మీడియాతో వాపోయారు.
ఎటూ తేల్చని పోలీసులు
ప్రదీప్ ఆత్మహత్య ఘటనపై పోలీసులు ఇంకా ఏ విషయం తేల్చలేదు. పావని వాదన ఎలా ఉన్నా నిజా నిజాలు లేల్చేందుకు వారు తమదైన పద్దతిలో ముందుకు సాగుతున్నారు. పోస్టు మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఏ విషయం తేల్చనున్నారు.