Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కళ్యాణ్కు ఆ సినిమాపై ఆసక్తి లేదు
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన ‘పికె' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఇటీవల తెలుగు నిర్మాత శరత్ మరార్ కూడా చూసారు. సినిమా బాగుండటంతో పవన్ కళ్యాణ్ను చూడమని రికమండ్ చేసాడు.
ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్
అయితే ఫిల్మ్ నగర్లో మాత్రం వార్తలు మరోలా స్ప్రెడ్ అయ్యాయి. శరత్ మరార్ ‘పికె' చిత్రం రీమేక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే పవన్ కళ్యాణ్ను సినిమా చూసి అభిప్రాయం చెప్పమన్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పవన్ కళ్యాణ్ సన్నిహితులు అంటున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించస్తున్న ‘గోపాల గోపాల' చిత్రం హిందీలో హిట్ అయిన ‘ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్. ‘పికె' చిత్రం విడుదలైన తర్వాత సినిమాపై అనేక విమర్శలు వచ్చాయి. పికె చిత్రం సబ్జెక్టు ఓ మై గాడ్ చిత్రానికి దగ్గరగా ఉందని కొందరు విమర్శిస్తున్నారు.
ఈ రెండు చిత్రాలను పోలుస్తూ బాలీవుడ్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వివాదాస్పదం అయిన చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించరని ఆయన సన్నిహితులు అంటున్నారు.