twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీడియాలో పవన్-చిరంజీవి గురించి రచ్చ!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ‘పిల్లా నువ్వు లేని జీవితం' ఆడియో వేడుకకు గైర్హాజరవ్వడం మరోసారి మీడియాకు చేతి నుండా పని కల్పించినట్లయింది. ఇదే అదునుగా చిరంజీవి-పవన్ కళ్యాణ్ మధ్య విబేధాలు ఇంకా కొనసాగుతున్నాయంటూ వార్తలు వండి పెడుతున్నారు.

    అక్టోబర్ 25న జరిగిన ఈ ఆడియో వేడుకకు మెగా హీరోలందరూ హాజరయ్యారు. చిరంజీవి చేతుల మీదుగా ఆడియో వేడుక జరుగగా, నాగ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ హాజరయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం గైర్హాజరయ్యారు. దీంతో కావాలనే అన్నయ్య హాజరైన వేడుకకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారనే ప్రచారం మొదలైంది.

    Pawan Kalyan-Chiranjeevi Rift Continues?

    అయితే ఎప్పటిలాగే మెగా ఫ్యామిలీ మెంబర్స్...మా మధ్యఎలాంటి విబేధాలు లేవు, మేమంతా కలిసే ఉన్నా, ఒకటే ఫ్యామిలీ, ఒకే బ్లడ్ అంటూ ప్రసంగాలు దంచేసారు. ఆడియో వేడుకలో రామ్ చరణ్ మాట్లాడుతూ...మీరు బాబాయ్ పవన్ కళ్యాణ్ సభలో ఉండాలని ఎంత గట్టిగా కోరుకుంటున్నారో...మీకన్నా ఎక్కవ వందరెట్లు నాకుంది. మీరు ఎప్పుడు సభలో పవర్ స్టార్ అని అరిచినా నేను మాట్లాడను. ఎందుకంటే నాకు మైక్ ఇచ్చినా నాకు కూడా అలాగే అరవాలని ఉంటుంది. మీరూ అరిచి, నేనూ అరచి, బాగుండదు కాబట్టి నేను ఎప్పుడూ మాట్లాడను. ఆయనకి నా మీద ఉన్న ప్రేమ లేదా నాకు ఆయన మీద ఉన్న ప్రేమ పబ్లిక్ గా చెప్పుకోనక్కర్లేదు. మీకు మీ మమ్మీ,డాడీ మీద ప్రేమ ఉందో లేదో పబ్లిక్ గా చెప్పుకోనక్కర్లేదు. అలాగే మేము చెప్పుకోము ఎప్పుడూ. ఫర్వాలేదు..మీరు అరుస్తూనే ఉండండి. మేం లోపల దాన్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటాం అన్నారు రామ్ చరణ్. ఆయన తాజాగా హాజరైన పిల్లా నువ్వు లేని జీవితం ఆడియో పంక్షన్ లో అభిమానులంతా పవర్ స్టార్ అని అరుస్తూంటే ఇలా స్పందించారు.

    English summary
    Pawan Kalyan has missed the audio launch of Pilla Nuvvu Lene Jeevitham(PNJ) which was held at Shilpa Kala Vedika on October 25th. The movie stars Sai Dharam Tej and Regina Cassandra in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X