Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ హీరోను చూస్తే అసహ్యం వేస్తున్నది.. సిగ్గుతో చస్తున్నా.. పవన్ కల్యాణ్ హీరోయిన్ ఫైర్
ఓ తెలుగు సినిమా హీరోపై టాలీవుడ్ హీరోయిన్ నికీషా పటేల్ విరుచుకుపడింది. అతడి పేరు ఎత్తడానికే మనసు ఒప్పడం లేదని ఆమె ట్విట్టర్లో దుమ్మెత్తి పోసింది. గతంలో పవర్స్టార్ పవన్ కల్యాణ్ సరసన కొమురం పులి సినిమా
ఓ తెలుగు సినిమా హీరోపై టాలీవుడ్ హీరోయిన్ నికీషా పటేల్ విరుచుకుపడింది. అతడి పేరు ఎత్తడానికే మనసు ఒప్పడం లేదని ఆమె ట్విట్టర్లో దుమ్మెత్తి పోసింది. గతంలో పవర్స్టార్ పవన్ కల్యాణ్ సరసన కొమురం పులి సినిమాలో నికీషా పటేల్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. అప్పుడప్పుడు తరచుగా మీడియాలో కనిపించే ఆమె తాజాగా ట్విట్టర్లో ఓ హీరోపై సెన్సేషనల్ కామెంట్ చేయడం ద్వారా మీడియాను మరోసారి ఆకర్షించింది.
|
బాహుబలిని చూశావా...
ప్రపంచవ్యాప్తంగా బాహుబలి2 ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్కరు బాహుబలి చూశావా లేక చూడకపోతే ఎప్పుడు చూస్తావు అని అడగడం సర్వసాధారణంగా మారింది. ఆ నేపథ్యంలోనే ఓ హీరోతో బాహుబలి2 సినిమా చూశావా అని నికీషా అడిగిందట. అందుకు ఆయన ఇచ్చిన సమాధానంతో చిర్రెత్తుకొచ్చిందని నికీషా ఆగ్రహం వ్యక్తం చేసింది.
|
దర్శకుడు ఎవరు అని ప్రశ్నించాడు..
నేను ఇటీవల ఓ హీరోను బాహుబలి2 చిత్రం చూశావా అని అడిగాను. అందుకు ఆయన నిర్లక్ష్యంగా ఆ సినిమా దర్శకుడు ఎవరు అని నన్ను ప్రశ్నించాడు. దాంతో ఆశ్చర్యపోవడం నా వంతు అయింది అని నికీషా ట్విట్టర్లో పేర్కొన్నది. టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటిన సినిమా గురించి అతను అలా మాట్లాడటాన్ని ఆమె తప్పుపట్టింది.
అంత నిర్లక్ష్యమా..
ఆ హీరో అలా చెప్పడం ఆయనలో ఉన్న అసూయ, ద్వేషభావం అద్దం పట్టింది. చరిత్ర సృష్టించిన సినిమా గురించి అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతాడా అని ప్రశ్నించింది. ఆ హీరో పేరు పలుకడానికి కూడా నాకు అసహ్యం వేస్తున్నది నికీషా ఆవేదన వ్యక్తం చేసింది. నిన్ను చూసి సిగ్గుతో తలవచ్చుకొంటున్నాను అని ఆమె తెలిపింది.
ఆ హీరో ఎవరు..
బాహుబలి2 సృష్టిస్తున్న ప్రభంజనం, కలెక్షన్ల జైత్రయాత్రను చూసి ప్రముఖ దర్శకులు శేఖర్ కపూర్, రాంగోపాల్ వర్మ, హీరోలు పవన్ కల్యాణ్, మహేశ్బాబు, రాంచరణ్ లాంటి వారు ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా నికీషా ట్వీట్లతో బాహుబలిపై అసూయ పడుతున్న హీరో ఎవరు అనే చర్చ ఒక్కసారిగా ప్రారంభమైంది. నికీషా సన్నిహితులను కొందరు అడిగి తెలుసుకొనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం.