Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ స్పీచ్ కు త్రివిక్రమ్ రాతలు.. అవి తప్పుడు నా కొడుకుల కూతలు
‘పవన్ ఓ చరిత్ర అని వందసార్లు చెప్పాను. పవన్ కల్యాణ్ కు రాసిచ్చేవాడు ఇంకా ఇండియాలో పుట్టలేదు’ అని బండ్ల గణేశ్ అన్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రసంగాలకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్పీచ్ రాస్తాడని అడిగిన ఓ ప్రశ్నకు నిర్మాత బండ్ల గణేష్ తీవ్రంగా స్పందించాడు. పనికిరాని, తప్పుడు నా కొడుకులు, అర్హతలేని వారు మాట్లాడే మాటల గురించి తనను అడుగవద్దని అన్నారు.
యూట్యూబ్ చానెల్ idreampost.com కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గణేష్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఎప్పుడైనా కలిశారా? త్రివిక్రమ్ ను ఎప్పుడైనా కలిశారా? పని పాటా లేని.. తప్పుడు నా కొడుకులు మాట్లాడే మాటలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇద్దరు మేధావులు, స్నేహితుల మధ్య అఘాతం సృష్టించడానికి కొందరు ఏదో మాట్లాడుతుంటారు అని మండిపడ్డారు.
అంతేకాకుండా 'పవన్ ఓ చరిత్ర అని వందసార్లు చెప్పాను. ఆయన ఇంట్లో సినిమా క్యాసెట్లు, డీవీడీలు ఉండవు. గది నిండా పుస్తకాలు ఉంటాయి. పవన్ కల్యాణ్ కు రాసిచ్చేవాడు ఇంకా ఇండియాలో పుట్టలేదు. ఆయనే పది మందికి రాసిస్తారు. పవర్ స్టార్ తో రెండు రోజులు జర్నీ చేస్తే ఆయన క్యాలిబర్, కెపాసిటీ, శక్తి ఏంటో తెలుస్తాయి. 2019లో పవన్ నిజమైన హీరో అవుతారు' అని బండ్ల గణేష్ అన్నారు.