Don't Miss!
- News 527 భారత ఫుడ్ ఐటమ్స్ లో క్యాన్సర్ కారకాలు-జాబితాలో ఇవే- ఈయూ గుర్తింపు..!
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఫ్యామిలీతో పవన్ అవుటింగ్.. ఫొటోలో ఎవరున్నారో చూడండి
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ కి చెందిన అరుదైన ఫొటో ఇది. ఆయన తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెస్టిన్ హోటల్ లో కలిసి డిన్నర్ కు వ్చచినప్పుడి ఫొటో ఇది. పవన్ కల్యాణ్ , ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్,పిల్లలనూ ఈ ఫొటోలో మీరు చూడవచ్చు. రేణు దేశాయ్..షార్ట్ హెయిర్ తో కూర్చుని తన పిల్లల అవసరాలు చూస్తోంది. పవన్ కళ్యాణ్ ఆ ఫొటో తీస్తున్న వ్యక్తి వంక చూస్తున్నారు.
ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సాధారణంగా పవన్ కల్యాణ్ బయట ఫంక్షన్లలోనూ, రెస్టారెంట్లలోనూ కనిపించడం చాలా అరుదు . అలాంటిది కొడుకు అకిరా, కూతురు ఆద్య సహా రేణూ దేశాయ్ తో కలిసి ఉన్న ఈ ఫోటోను ఫ్యాన్స్ ఓ రేంజిలో షేర్ చేస్తున్నారు.
రెస్టారెంట్ కి వచ్చినప్పుడు అక్కడే ఉన్న మరో కస్టమర్ ఈ ఫోటోను తీసినట్టుగా తెలుస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ పిల్లలతో సమయం గడిపేందుకు పవన్ ఇలా తీరిక చేసుకున్నట్టు చెప్తున్నారు.
ఆగిపోయిన పవన్ ..10 సినిమాలు లిస్ట్ (పొస్టర్స్ తో )
'సర్దార్..' విషయానికి వస్తే... పవన్ కళ్యాణ్, కాజల్ జంటగా బాబీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్స్, ఈరోస్ ఇంటర్నేషనల్ పతాకాలపై శరత్ మారర్, సునీల్ లుల్లా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సర్దార్ గబ్బర్సింగ్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో భాగంగా గుర్రాల మేళా జరుగుతోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. 'హార్స్ మేళా' పేరుతో గుర్రాలపై షూటింగ్ చేస్తున్నాం. ఈ మేళాలో వంద గుర్రాలు, వంద మంది అశ్వికులు, 40 మంది చిత్రానికి సంబంధించిన ప్రధాన తారగణం, అలాగే వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా మూడు యూనిట్స్తో 'హార్స్మేళా' సన్నివేశాలను అత్యంత భారీగా చిత్రీకరిస్తున్నాం.
నో మూడ్, ఏకాదశి ఇంకా... : 'గబ్బర్ సింగ్'...కొన్ని సీక్రెట్స్
ఈ మేళా సినిమాకే హైలైట్గా నిలుస్తుంది. గుర్రాలే కాకుండా కొన్ని పురాతన కార్లతోపాటు అధునాతన కార్లను కూడా చిత్రీకరణలో వాడుతున్నాం. సాంకేతిక విలువలకు పెద్ద పీట వేస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే బరోడా, రాజ్కోట, కేరళ, మల్షేట్స్ ఘాట్స్, మహారాష్ట్ర తదితర ప్రదేశాల్లో జరిగింది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మార్చిలో ఆడియోను విడుదల చేసి, ఏప్రిల్ 8న సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.