Don't Miss!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి!
హైదరాబాద్: 'జల్సా', 'అత్తారింటికి దారేది' చిత్రాలతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ తనకు అత్యంత సన్నిహితుడైన 'హారిక అండ్ హాసిని' క్రియేషన్స్ సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ కోసం ఈ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారట.
పవన్ కళ్యాణ్ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం చేయడానికి త్రివిక్రమ్ ఓ కథ తయారు చేసాడట. ఈ కథ పవన్ కళ్యాణ్ కి కూడా బాగా నచ్చిందట. దాంతో పవన్, త్రివిక్రమ్ ప్లాన్ చేసిన 'కోబలి' చిత్రాన్ని పక్కన పెట్టి ఈ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నారట. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాచేస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
ఇక త్రివిక్రమ్ నితిన్ హీరోగా మరో సినిమా చేస్తున్నారు. 'హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ ' బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి టైటిల్ ఖరారు అయ్యింది. "అ...ఆ" ...ట్యాగ్ లైన్ గా .. "అనసూయ రామలింగం వెర్శస్ ఆనంద్ విహారి " అని ఫిక్స్ చేసినట్లు నిర్మాత మీడియాకు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో తెలియచేసారు.
ఇక ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా సమంత, మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ (ప్రేమమ్ ఫేమ్ మళయాళి భామ) చేస్తోంది. . ఈ నిర్మాతతో త్రివిక్రమ్ కు ఇది మూడో సినిమా. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత ఈ నిర్మాత చేస్తున్న చిత్రం ఇదే. సెప్టెంబర్ మూడవ వారం నుంచి ఈ చిత్రం మొదలుకానుంది. సంక్రాంతికి కు విడుదల చేస్తారు.
ఈ చిత్రం కు సౌండ్ డిజైనర్ గా విష్ణు గోవింద్, శ్రీ శంకర్ పనిచేయనున్నారు. సంగీతం అనిరుధ్, సినిమాటోగ్రఫి నటరాజ్ సుబ్రమణ్యన్, ఆర్ట్ రాజీవన్, ఎడిటింగ్ ...కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్...పిడివి ప్రసాద్. ఈ సినిమాని శ్రీమతి మమత సమర్పిస్తున్నారు.