Don't Miss!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- News Gannavaram: ఒకే రోజు వంశీ, యార్లగడ్డ నామినేషన్- ఇద్దరికీ షాక్..?
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
పవన్ మాత్రమే కాదు త్రివిక్రమ్ కూడా కంప్లైంట్
హైదరాబాద్ : ఎవరూ ఊహించని విధంగా నాన్నకు ప్రేమతో నిర్మాతపై పవన్ కళ్యాణ్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తొలిసారిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)ను సంప్రదించి ఫిర్యాదు చేసారు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అదే నిర్మాతపై తన బకాయిల విషయమై కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదే నిర్మాతతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గతంలో ‘అత్తారింటికి దారేది' చిత్రం చేసారు. ఈ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో ఏర్పడ్డ వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తనకు ఇవ్వాల్సిన రెండు కోట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని పవన్ కళ్యాణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఎంత అనేది తెలియదు కానీ త్రివిక్రమ్ కూడా కంప్లైంట్ చేసారని అంటున్నారు.
ప్రముఖ నిర్మాత బి.వి.యస్.ఎన్ ప్రసాద్పై నటుడు పవన్ కల్యాణ్ ‘మా'కు ఫిర్యాదు చేశారు. ‘అత్తారింటికి దారేది' చిత్రం రెమ్యునరేషన్కు సంబంధించి తనకు ఇవ్వాల్సిన బకాయి చెల్లించలేదని పవన్ కల్యాణ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘అత్తారింటికి దారేది' చిత్రం రెమ్యునరేషన్లో కొంతభాగం మాత్రమే చెల్లించారని, మిగిలినది ‘నాన్నకు ప్రేమతో' చిత్రం విడుదల సమయంలో ఇస్తానని ప్రసాద్ తనకు తెలిపారని ఫిర్యాదులో పవన్ కల్యాణ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే బి.వి.యస్.ఎన్ ప్రసాద్ ప్రస్తుతం ఆ మిగిలిన బకాయి చెల్లించకపోవడంతో పవన్కల్యాణ్ ‘మా'ను ఆశ్రయించినట్లు సమాచారం.