Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మంచి ముహూర్తాలు లేవనే పవన్ సైతం అదే రోజు
హైదరాబాద్: అన్నదమ్ములు పవన్, చిరంజీవి ఒకే ముహూర్తానికి ఫిక్సయ్యారు. వీరిద్దరి కొత్త చిత్రాలు ప్రారంభం ఈ నెల 29 నే లాంచ్ కానున్నట్లు సమాచారం. ఆ చిత్రాలు మరోవో కావు...చిరంజీవి 150 వ చిత్రం, పవన్ , ఎస్ సూర్య కాంబినేషన్ చిత్రమూను.
చిరంజీవి 150వ చిత్రంపైన ఆసక్తి ఉన్నట్లే... 'సర్దార్ గబ్బర్సింగ్' తరవాత పవన్ కల్యాణ్ చేయబోయే చిత్రం గురించి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు చిత్రాలు ఎప్పుడెప్పుడు మొదలెడతారా అనే ఆసక్తి నెలకొంది.
చిరంజీవి - వినాయక్ల 'కత్తి' రీమేక్కి ఈనెల 29న లాంఛనంగా కొబ్బరికాయ కొట్టేస్తున్నారని ఫిల్మ్నగర్ వర్గాల సమాచారం. అదే రోజున పవన్ కల్యాణ్ - ఎస్.జె.సూర్యల సినిమా కూడా ముహూర్తం జరుపుకోనుందట. 29వ తారీఖు దాటితే మంచి ముహూర్తాలు లేవని వీరిద్దరూ అదే రోజున తమ సినిమాని లాంఛనంగా ప్రారంభించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
రెగ్యులర్ షూటింగ్ విషయానికి వస్తే...వచ్చే నెల చివరి వారంలో చిరు సినిమా సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉంది. పవన్ - సూర్యల చిత్రం కూడా వచ్చే నెలలోనే మొదలవుతుంది. ఈలోగా అటు వినాయక్, ఇటు ఎస్.జె సూర్య స్క్రిప్ట్పై కసరత్తులు ముమ్మరం చేశారు. చిరు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్, పవన్ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.