Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
విమర్శలు వద్దంటూ పవన్ కల్యాణ్
హైదరాబాద్: వైపరీత్యం సమయంలో ఐటీ విశాఖకు రాదంటూ విమర్శలు చేయటం సరికాదన్నార పవన్ కళ్యాణ్. హుదుద్ తుపాను విశాఖలో కలిగించిన నష్టం బాధాకరమని సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం ఉదయం విశాఖలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తుపాను బాధితులను ఆదుకునేందుకు తనవంతు సాయంగా రూ.50లక్షల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.... క్లిష్ట సమయాలను ఎదుర్కొనే నాయకత్వ లక్షణాలు చంద్రబాబులో ఉన్నాయన్నారు. తక్షణ సాయం ప్రకటించిన ప్రధానమంత్రి మోదీ, ప్రజలకు అండగా ఉన్న చంద్రబాబుకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు రాజకీయాలు చేయడం తగదని,చంద్రబాబుకు సహకరించాలని సూచించారు. విశాఖ స్మార్ట్ సిటీగా అవబోతున్న వేళ... ఈ విపత్తుబాధ కలిగిస్తోందన్నారు.
ప్రస్తుతం పవన్ నటిస్తున్న 'గోపాల గోపాల' విషయానికి వస్తే...
వెంకటేష్, పవన్ కల్యాణ్ హీరోలుగా 'గోపాల గోపాల' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే . ''బాలీవుడ్లో విజయం సాధించిన 'ఓ మైగాడ్' చిత్రానికిది రీమేక్. తెలుగు వాతావరణానికి వెంకీ, పవన్ల శైలికి తగినట్టుగా కొన్ని మార్పులు చేశాం. పవన్ పలికే సంభాషణలు అందరికీ నచ్చుతాయి'' అని నిర్మాతలు చెబుతున్నారు. మిథున్ చక్రవర్తి, దీక్షాపంత్, మధుశాలిని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్
దర్శకుడు చిత్రం గురించి మాట్లాడుతూ...దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? హుండీలో డబ్బులెందుకు వేయాలి? హారతి ఇవ్వకపోతే దేవుడు మొర ఆలకించడా? ఇలాంటి సవాలక్ష సందేహాలున్నాయి అతనికి. దేవుడుంటే ఈ సృష్టినంతటినీ సమానంగా చూడాలి కదా? ఒకరెక్కువ, ఒకరు తక్కువ అనే బేధాలెందుకు అంటూ స్వామీజీలనూ తన పశ్నలతో హడలెత్తించాడు. జవాబులు దొరకలేదు. చివరికి సమాధానం ఇవ్వడానికి స్వయంగా శ్రీకృష్ణుడే దిగొచ్చాడు. ఆ వైనం ఏ రీతిన సాగిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు కిషోర్కుమార్ పార్థసాని (డాలీ). ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గోపాల గోపాల'.
పవన్కల్యాణ్
'గోపాల
గోపాల'లో
మోడ్రన్
శ్రీకృష్ణుడి
పాత్రని
పోషిస్తున్న
సంగతి
తెలిసిందే.
ఈ
చిత్రం
హిందీ
ఓ
మైగాడ్
రీమేక్.
ఈ
చిత్రంఒరిజనల్
లో
అక్షయ్
కుమార్
ఓ
బైక్
మీద
వచ్చి
హల్
చల్
చేస్తాడు.
ఇప్పుడు
అదే
టైప్
లో
పవన్
సైతం
ఓ
స్పెషల్
బైక్
లో
వస్తారు.
ఆ
బైక్
డిజైన్
మీరు
చూస్తున్నదే.
అది
ఇటీవలే
బయిటకు
వచ్చింది.
దానిపై
ఓమ్
...786
అని
ఉంది.
హ్యూసంగ్
జీవి
650
అఖీలా
పీఆర్ఓ
ఈ
బైక్
పేరు.
భారీ
ఆకారంతో
భారీ
సీసి
ఉన్న
బైక్
ఇది.
సినిమా
రిలీజయ్యాక
ఈ
బైక్
గురించి
చాలా
కాలం
అభిమానులు
మాట్లాడుకుంటారని
అంచనా
వేసి
మరీ
అన్ని
జాగ్రత్తలూ
తీసుకుని
మరీ
ఈ
బైక్
ని
ఇలా
డిజైన్
చేసారు.
ఈ
బైక్
ఖరీదు
6,60,000.
ఇక ఈ చిత్రంలో పవన్ పలికే సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. వెంకటేష్ మరో హీరోగా చేస్తున్న సినిమాలో పవన్ పాత్ర కేవలం 25 నిముషాలేట. అయితే ఇప్పుడు అభిమానులు నిరాశపడతారని దాని నిడివి పెంచినట్లు సమాచారం. ఆ పాత్ర ఇప్పుడు సెకండాఫ్ లో దాదాపు పూర్తిగా ఉంటుంది. కీలకమైన సన్నివేశాల్లో దాదాపు 45 నిముషాల సేపు కనపిస్తాడట. ఇరవై నిముషాల సేపు ఆయన పాత్ర నిడివి పెంచారని సమాచారం.
సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రియ ముఖ్యపాత్రలో కనిపిస్తుంది. కృష్ణుడు, మధుశాలిని, వెన్నెల కిషోర్, దీక్షా పంత్ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్, కూర్పు: గౌతంరాజు, శరత్మరార్. సురేష్బాబు నిర్మాతలు.