Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు....
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వేడుకలు, ఆడియో ఫంక్షన్లకు వీలైనంత దూరంగా ఉంటారు. తన ఫ్యామిలీ మెంబర్స్ సినిమా ఫంక్షన్లకే ఆయన వెళ్లరు. ఆ మధ్య తన అభిమాని నితిన్ పోరు పడలేక ఆ మధ్య ఓ సారి ఆడియో ఫంక్షన్ కు హాజరయ్యారంతే.
మాజీ ప్రధాని దేవెగౌడ మనవుడు, కర్నాటక మాజీ ముఖ్య మంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయం చేస్తూ రూ. 75 కోట్ల బడ్జెట్ తో 'జాగ్వార్' అనే తీసారు. ఈ చిత్రం ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా రావాలని కుమారస్వామి స్వయంగా వచ్చి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు.
పవన్ వస్తాడని ప్రచారం బాగానే జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ రాలేదు. ఇటీవల మారిన కొన్ని పరిస్థితులతో ఆయన చాలా బిజీ అయ్యారు. ఈ విషయమై కుమారస్వామికి పవన్ కళ్యాణ్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.
అనివార్య కారణాల వల్ల ఈ ఆడియో ఫంక్షన్కు రాలేకపోతున్నానని, ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగితే తప్పక వస్తానని చెప్పాడట. దీనికి వెంటనే కుమారస్వామి బదులిస్తూ సినిమా విడుదలైన వారంలోపే విశాఖలో సక్సెస్మీట్ నిర్వహిస్తామని, దానికి తప్పకుండా రావాలని చెప్పారట కుమారస్వామి.