Don't Miss!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
డి.సురేష్ బాబు 'పెళ్లిచూపులు' ప్రారంభం
హైదరాబాద్: విజయ్ దేవరకొండ, రీతు వర్మ హిరో హిరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం 'పెళ్లిచూపులు' చిత్ర షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. దీనికి కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ క్లాప్ ఇవ్వగా.. నటుడు అశోక్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు... ఈ చిత్రాన్ని ధర్మపథ క్రియేషన్స్, బిగ్బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి డి.సురేష్బాబు క్లాప్నిచ్చారు. అశోక్కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. శ్రీనివాస్ అవసరాల గౌరవ దర్శకత్వం వహించారు.
దర్శకుడు మాట్లాడుతూ ''సంప్రదాయ వాతావరణంలో సాగే ఆధునిక ప్రేమకథ ఇది. ఒక కొత్త రకమైన సినిమా చేద్దామని చెప్పగానే ఎక్కడా అడ్డు చెప్పకుండా కావల్సినంత స్వేచ్ఛ ఇచ్చారు నిర్మాతలు. విజయ్, రీతూకి మంచి పేరు తీసుకొచ్చే చిత్రమవుతుంది'' అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన రాజ్ కందుకూరి మాట్లాడుతూ ''దర్శకుడు తరుణ్భాస్కర్ అనేక లఘు చిత్రాలు తీశాడు. ఆయన తయారు చేసిన ఈ కథలో కొత్తదనం ఉంది. 'ఉయ్యాల జంపాల', 'మనం'లా ఒక మంచి అనుభూతినిచ్చే సినిమా అవుతుంది. లైవ్ రికార్డింగ్తో చిత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తున్నామ''న్నారు.
చిన్న చిత్రాల ద్వారా చిత్ర పరిశ్రమకు కొత్త వారిని పరిచయం చేయడం ఆనందంగా ఉందని నిర్మాతలు పేర్కొన్నారు. 49 రోజుల షూటింగ్తో ఈ చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. చిత్రానికి ఛాయాగ్రహణం: నగేష్, సంగీతం: వివేక్ సాగర్