Don't Miss!
- Lifestyle ప్రేమ విషయంలో ఈ రాశులను మాత్రం అస్సలు నమ్మకూడదు..నమ్మక ద్రోహం చేస్తారు..
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అక్రమాలు: ‘బాహుబలి’ టికెట్లపై హైకోర్టులో పిల్
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' చిత్రం జులై 10న విడుదలవుతున్న నేపథ్యంలో గత వారం రోజులుగా అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు అమ్మతున్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల టికెట్ల కోసం గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి టికెట్ల అమ్మకాలపై హైకోర్టులో గురువారం పిల్(ప్రజా ప్రయోజనాల వాజ్యం) దాఖలైంది. నరసింహ రావు అనే వ్యక్తి ఈ పిల్ దాఖలు చేసారు.
బాహుబలి టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఒక పథకం ప్రకారం సినిమాపై హైప్ పెంచారు, దీంతో అభిమానులు టికెట్ల కోసం గొడవలకు దిగుతున్నారు. గతంలో మగధీర చిత్రానికి సంబంధించి ఇదే విధంగా జరగడంతో ఏడుగురు మరణించారని, ఈ పరిణామాల నేపథ్యంలో ప్రేక్షకుల ప్రాణాలకు ప్రమాదం ఉండే అవకాశం ఉందని పిల్ లో పేర్కొన్నారు. ఈ తరుణంలో థియేటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రదర్శనను పరిమితం చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిల్ ను విచారణకు స్వీకరించిన కోర్టు రేపు విచారించనుంది.
ఫస్ట్క్లాస్ టికెట్లను వారం పాటు ఆన్లైన్లో అమ్మాలని థియేటర్ యాజమానులను ఆదేశించినట్లు విశాఖ పట్నం జాయింట్ కలెక్టర్ నివాస్ తెలిపారు. బ్లాక్లో టికెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు. థియేటర్ల యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జేసీ సత్య నారాయణ హెచ్చరించారు.